ఇప్పటివరకు ఉత్తరాధిని వణికించేస్తున్న కరోనా వైరస్ పడగ తాజాగా బెంగుళూరు మీద పడింది. కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు సిటిలో రోజుకు కనీసం వందమంది దాకా చనిపోతున్నట్లు సమాచారం. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకోసమని ప్రభుత్వం ప్రత్యేకంగా 5 శ్మశానవాటికలను ఏర్పాటుచేసింది. అయితే ఇపుడు కరోనా వైరస్ తీవ్రత దెబ్బకు ఇవి ఏమాత్రం సరిపోవటంలేదని సమాచారం.
బెంగళూరులోని జాలహళ్ళి, సుమనహళ్ళి, కెంగేరి, బొమ్మనహళ్ళి, పెనత్తూరు శ్మశానవాటికలను ప్రభుత్వం కరోనా మృతుల అంత్యక్రియల కోసం కేటాయించింది. అంటే సిటి మొత్తంమీద ఎవరు ఎక్కడ కరోనాతో చనిపోయినా పై ఐదు చోట్లకు మాత్రమే తీసుకురావాలి. దాంతో ఆసుపత్రుల నుండి లేదా ఇళ్ళనుండి తీసుకొస్తున్న మృతదేహాలను ఉంచటానికి శ్మశానవాటికల్లో చోటు సరిపోటంలేదు.
లోపల చోటు లేకపోవటంతో డెబ్ బాడీస్ ను పెట్టుకుని జనాలు రోడ్లపైనే వెయిట్ చేయాల్సొస్తోంది. దీంతో చుట్టుపక్కల నివాసాలుండే వాళ్ళకు బాగా ఇబ్బందిగా తయారైంది. ఇదే విషయమై ప్రతిరోజు స్ధానికులు మృతదేహాలను తీసుకొచ్చినవాళ్ళతో గొడవలు పడుతున్నారట. మొన్నటి ఏప్రిల్లోనే సిటిలో కరోనా వైరస్ తో సుమారు 400 మంది చనిపోయారు.
అప్పట్లోనే దహనానికి చాలా ఇబ్బందయ్యింది. అలాంటిది ఇపుడు రోజుకు 100 మంది చనిపోవటమంటే మామూలు విషయంకాదు. దహన సంస్కారాలకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లుచేస్తున్నా సరిపోవటంలేదు. ఇదే పరిస్ధితి ఉత్తరాధిలోని ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనిపిస్తోంది. అలాంటిది ఉత్తరాధి పరిస్దితే ఇపుడు ధక్షిణాదిలోని బెంగుళూరులో కూడా మొదలైంది. మరీ పరిస్దితి ఎప్పుడు సద్దుమణుగుతుందో ఏమో.
This post was last modified on April 17, 2021 11:55 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…