Trends

బెంగుళూరును వణికించేస్తున్న కరోనా

ఇప్పటివరకు ఉత్తరాధిని వణికించేస్తున్న కరోనా వైరస్ పడగ తాజాగా బెంగుళూరు మీద పడింది. కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు సిటిలో రోజుకు కనీసం వందమంది దాకా చనిపోతున్నట్లు సమాచారం. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకోసమని ప్రభుత్వం ప్రత్యేకంగా 5 శ్మశానవాటికలను ఏర్పాటుచేసింది. అయితే ఇపుడు కరోనా వైరస్ తీవ్రత దెబ్బకు ఇవి ఏమాత్రం సరిపోవటంలేదని సమాచారం.

బెంగళూరులోని జాలహళ్ళి, సుమనహళ్ళి, కెంగేరి, బొమ్మనహళ్ళి, పెనత్తూరు శ్మశానవాటికలను ప్రభుత్వం కరోనా మృతుల అంత్యక్రియల కోసం కేటాయించింది. అంటే సిటి మొత్తంమీద ఎవరు ఎక్కడ కరోనాతో చనిపోయినా పై ఐదు చోట్లకు మాత్రమే తీసుకురావాలి. దాంతో ఆసుపత్రుల నుండి లేదా ఇళ్ళనుండి తీసుకొస్తున్న మృతదేహాలను ఉంచటానికి శ్మశానవాటికల్లో చోటు సరిపోటంలేదు.

లోపల చోటు లేకపోవటంతో డెబ్ బాడీస్ ను పెట్టుకుని జనాలు రోడ్లపైనే వెయిట్ చేయాల్సొస్తోంది. దీంతో చుట్టుపక్కల నివాసాలుండే వాళ్ళకు బాగా ఇబ్బందిగా తయారైంది. ఇదే విషయమై ప్రతిరోజు స్ధానికులు మృతదేహాలను తీసుకొచ్చినవాళ్ళతో గొడవలు పడుతున్నారట. మొన్నటి ఏప్రిల్లోనే సిటిలో కరోనా వైరస్ తో సుమారు 400 మంది చనిపోయారు.

అప్పట్లోనే దహనానికి చాలా ఇబ్బందయ్యింది. అలాంటిది ఇపుడు రోజుకు 100 మంది చనిపోవటమంటే మామూలు విషయంకాదు. దహన సంస్కారాలకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లుచేస్తున్నా సరిపోవటంలేదు. ఇదే పరిస్ధితి ఉత్తరాధిలోని ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనిపిస్తోంది. అలాంటిది ఉత్తరాధి పరిస్దితే ఇపుడు ధక్షిణాదిలోని బెంగుళూరులో కూడా మొదలైంది. మరీ పరిస్దితి ఎప్పుడు సద్దుమణుగుతుందో ఏమో.

This post was last modified on April 17, 2021 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

49 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

1 hour ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

3 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

4 hours ago