ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిస్థితులు ఎంత తీవ్రంగా.. మరెంత దారుణంగా ఉన్నాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పాలి. రోజులు గడుస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు.. అందుకు తగ్గట్లు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందని దుస్థితి. దీంతో.. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సామాన్యుల సంగతి తర్వాత.. సమాజంలో గుర్తింపు.. గౌరవంతో పాటు.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారికి సైతం వైద్య సదుపాయం అందటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ కు చెందిన ఇంద్రాణీ బెనర్జీ మరణించిన వైనం తెలిస్తే నోట మాట రాదంతే. ఈ ప్రొఫెసర్ ప్రొఫైల్ మామూలుగా ఉండదు. ఆమె బార్క్ లో ఫెలో.. కాలిఫోర్నియా వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. అలాంటి ఆమె గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో నానో సైన్సెస్ విభాగంలో డీన్ గా వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆమె.. కరోనా పాజిటివ్ గా తేలింది.
శ్వాస సమస్య తలెత్తటంతో ఆమెను తొలుత గాంధీ నగర్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రద్దీగా ఉండటం.. బెడ్లు లేకపోవటంతో.. ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. అయితే.. అక్క ఆక్సిజన్ కాన్సట్రేటర్.. వెంటిలేటర్ లేదని చెప్పటంతో సొంత వాహనంలోనే అహ్మదాబాద్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆ ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకోలేదు.
దీనికి కారణంగా.. ఆమెను అంబులెన్సులో తీసుకురాలేదని చెప్పారు. దీంతో.. మళ్లీ గాంధీనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆమె మరణించారు. అన్ని హంగులు ఉండి కూడా.. వైద్యసాయానికి అవసరమైన సదుపాయాలు లేకపోవటంతో.. ఆమె ప్రాణాలు విడవక తప్పలేదు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం దేనికి నిదర్శనం?
This post was last modified on April 14, 2021 12:28 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…