హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అన్న సందేహమే కాదు.. చిన్న వయసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలా? అన్న షాక్ కు గురి కావాల్సిందే. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం ఎంతకూ మింగుడుపడనిదిగా మారుతుంది. పోలీసులు సైతం విస్మయానికి గురైన ఈ ఉదంతంలోకి వెళితే..
హైదరాబాద్ లోని ఒక కాలనీలో ఎంబీబీఎస్ చదివి అమ్మాయి పక్కింట్లో తొమ్మిది తరగతి చదివే అబ్బాయి ఉన్నాడు. తమ్ముడు వయసున్న చిన్న పిల్లాడే కదా అని ఆమె అతన్ని నమ్మింది. తన ఫోన్ అడిగితే అమాయకంగా ఇచ్చేసింది. ఒకరోజు ఆమె ఫోన్ లో ఆమె మొయిల్ ఐడీ పాస్ వర్డ్ మార్చేశాడు. అక్కడ్నించి ఆమె పేరుతో ఆన్ లైన్ క్లాసుల్లోఅసభ్య సందేశాలు పెట్టటం.. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టటం లాంటివి చేసేవాడు. దీంతో.. ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యేది.
తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయని విలవిలలాడేది. తాను ఎదుర్కొంటున్న సమస్యను..దీనంతటికి కారణమైన ఆ పిల్లాడికే అమాయకంగా చెప్పేసేది. ఆ పిల్లాడు సైతం.. ఏవో మాటలు చెప్పేసేవాడు. రోజురోజుకీ టార్చర్ పెరిగిపోవటంతో తట్టుకోలేని ఆ యువతి.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. పిల్లాడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను చేసిన ఎదవ పనిని ఒప్పుకున్నాడు.
ఇతరుల ఫోన్లు తీసుకొని వారి పాస్ వర్డ్ లు మార్చటం.. వేరే సిస్టం నుంచి వారి మొయిల్ ఓపెన్ చేసి.. తప్పుడు మెసేజ్ లు పోస్టు చేయటం తనకు అలవాటుగా ఒప్పుకున్నాడు. దీంతో.. సైబర్ నిబంధనల ప్రకారం ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకొని జువెనైల్ హోమ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పక్కింటి పిల్లాడే అనుకున్న ఆమెకు.. జరిగినదంతా తెలిసి షాక్ కు గురయ్యారు. పిల్లాడని నమ్మితే ఇంత దారుణానికి పాల్పడతాడా? అంటూ విస్మయానికి గురయ్యారు.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…