Trends

పక్కా ప్లాన్ తోనే మావోయిస్టుల దాడి ?

అవును ఛత్తీస్ ఘడ్ తరెం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోలీసులపై మావోయిస్టులు విసిరిన పంజాకు సుమారు 25 మంది జవాన్లు బలైపోయారు. ఇపుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి చనిపోయిన వారిసంఖ్య 25 అని చెప్పేందుకు లేదు. నిజానికి తెలుగురాష్ట్రాల్లోని గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టుల ఏరివేతలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులకు గ్రేహౌండ్స్ తరహా ట్రైనింగ్ లేదనే చెప్పాలి.

అయినా సరే మావోయిస్టులను వెతుక్కుంటు సీఆర్పీఎఫ్ జవాన్లు అడవుల్లోకి వెళ్ళనిందుకు భారీ జరిమానానే చెల్లించుకోవాల్సొచ్చింది. నిజానికి ఇక్కడ జరిగిందేమంటే సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు ఓ ప్లాన్ ప్రకారం ఉచ్చులోకి లాగారు. తమకు తెలియకుండానే ముందు వెనక చూసుకోకుండా జవాన్లు మావోయిస్టుల ఉచ్చులో ఇరుక్కుపోయారు. దాంతో భారీసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ప్రతి ఏడాది జనవరి-జూలై మధ్య మావోయిస్టులు కొత్త రిక్రూట్లు చేస్తుంటాయి. అలాగే అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటాయి. వాటి పనితీరు, ఉపయోగించే విధానాలపై దట్టమైన అడవుల్లో ట్రైనింగ్ తీసుకుంటాయి. ఇందులో భాగంగానే తరెం అడవుల్లో కొన్నిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు మకాం వేశారు. ట్రైనింగ్ పూర్తిచేసుకుని ప్రాక్టికల్స్ చేద్దామని తీర్మానించుకున్నాయి.

తీర్మానంలో భాగంగా వ్యూహాత్మకంగా అటవీప్రాంతాల్లోని ఒకరిద్దరు అమయాకులను కాల్చి చంపేశాయి. దాంతో విషయం తెలుసుకున్న జవాన్లు వెంటనే మావోయిస్టులను వేటకోసం అడవుల్లోకి వెళ్లారు. వాళ్ళ వస్తున్న విషయం, ఏ దారిలో వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న మావోస్టులు షెల్టర్ జోన్లలో కాపుకాచారు. తమ టార్గెట్లోకి జవాన్లు చేరుకున్నారని నిర్ధారించుకోగానే వెంటనే కాల్పులు మొదలుపెట్టారు.

మావోయిస్టుల నుండి ఊహించని రీతిలో కాల్పులు మొదలయ్యేసరికి తేరుకోవటానికే చాలా సమయం పట్టింది. సమయం తీసుకున్నా షెల్టర్ తీసుకోవటానికి అవకాశం కూడా జవాన్లకు లేకుండాపోయింది. దాంతోనే భారీగా ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. నిజానికి ఇద్దరిని మావోయిస్టులు కాల్చి చంపేసిన సమాచారం, మావోయిస్టులు ఎక్కడున్నారనే సమాచారన్ని జవాన్లకు చేరవేసింది కూడా మావోయిస్టులే. అయితే ఇలాంటి గెరిల్లా యుద్ధాల్లో అనుభవం లేని జవాన్లు మావోయిస్టులను మట్టుపెట్టేందుకు అడవుల్లోకి వెళ్ళి చివరకు తామే బలైపోయారు.

Satya

Recent Posts

ఏషియ‌న్ సునీల్‌పై నాగ‌వంశీ రివెంజ్?

టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కున్న పాపులారిటీనే వేరు. ప్ర‌స్తుతం…

31 minutes ago

రామాయ‌ణ పై ముందే చేతులెత్తేసిన కాజ‌ల్

స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో న‌టించిన‌పుడు వారి ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌లు లేక‌పోతే.. అభిమానులు ఫీల‌వ‌డం…

2 hours ago

టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…

2 hours ago

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…

4 hours ago

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

11 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

11 hours ago