ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, గన్నవరంలోని హరిజనవాడకు చెందిన ఓ గ్యాంగ్, పామర్తి నగర్ కు చెందిన మరొక గ్యాంగ్ స్థానిక బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కలిశారు. ఇరువర్గాల మధ్య మొబైల్ ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడారు. నాలుగు సార్లు ఈ గేమ్ ఆడగా ఇరువర్గాల వారు రెండు సార్లు గెలిచారు. ఈ విధంగా గేమ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల వారు మేము బాగా ఆడాము అంటే మేం బాగా ఆడాము అని ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.
ఈ క్రమంలోనే తమ వారిని కొడుతున్నారంటూ హరిజనవాడకు చెందిన 30 మంది, పామర్తి నగర్ కు చెందిన 30 మంది హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకొని పెద్దఎత్తున కర్రలు, బ్లేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గణేష్ అనే యువకుడితో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
This post was last modified on April 2, 2021 9:00 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…