ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, గన్నవరంలోని హరిజనవాడకు చెందిన ఓ గ్యాంగ్, పామర్తి నగర్ కు చెందిన మరొక గ్యాంగ్ స్థానిక బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కలిశారు. ఇరువర్గాల మధ్య మొబైల్ ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడారు. నాలుగు సార్లు ఈ గేమ్ ఆడగా ఇరువర్గాల వారు రెండు సార్లు గెలిచారు. ఈ విధంగా గేమ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల వారు మేము బాగా ఆడాము అంటే మేం బాగా ఆడాము అని ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.
ఈ క్రమంలోనే తమ వారిని కొడుతున్నారంటూ హరిజనవాడకు చెందిన 30 మంది, పామర్తి నగర్ కు చెందిన 30 మంది హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకొని పెద్దఎత్తున కర్రలు, బ్లేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గణేష్ అనే యువకుడితో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
This post was last modified on April 2, 2021 9:00 pm
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…