ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, గన్నవరంలోని హరిజనవాడకు చెందిన ఓ గ్యాంగ్, పామర్తి నగర్ కు చెందిన మరొక గ్యాంగ్ స్థానిక బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కలిశారు. ఇరువర్గాల మధ్య మొబైల్ ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడారు. నాలుగు సార్లు ఈ గేమ్ ఆడగా ఇరువర్గాల వారు రెండు సార్లు గెలిచారు. ఈ విధంగా గేమ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల వారు మేము బాగా ఆడాము అంటే మేం బాగా ఆడాము అని ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.
ఈ క్రమంలోనే తమ వారిని కొడుతున్నారంటూ హరిజనవాడకు చెందిన 30 మంది, పామర్తి నగర్ కు చెందిన 30 మంది హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకొని పెద్దఎత్తున కర్రలు, బ్లేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గణేష్ అనే యువకుడితో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
This post was last modified on April 2, 2021 9:00 pm
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…