Trends

చిచ్చు పెట్టిన మొబైల్ గేమ్.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, గన్నవరంలోని హరిజనవాడకు చెందిన ఓ గ్యాంగ్, పామర్తి నగర్ కు చెందిన మరొక గ్యాంగ్ స్థానిక బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కలిశారు. ఇరువర్గాల మధ్య మొబైల్ ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడారు. నాలుగు సార్లు ఈ గేమ్ ఆడగా ఇరువర్గాల వారు రెండు సార్లు గెలిచారు. ఈ విధంగా గేమ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల వారు మేము బాగా ఆడాము అంటే మేం బాగా ఆడాము అని ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.

ఈ క్రమంలోనే తమ వారిని కొడుతున్నారంటూ హరిజనవాడకు చెందిన 30 మంది, పామర్తి నగర్ కు చెందిన 30 మంది హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకొని పెద్దఎత్తున కర్రలు, బ్లేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గణేష్ అనే యువకుడితో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

This post was last modified on April 2, 2021 9:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ – దేవి : ఆరు మెలోడీల లవ్ స్టోరీ

అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…

17 minutes ago

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

49 minutes ago

స్టార్ పిల్లలను పట్టించుకోవడం లేదబ్బా

మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…

52 minutes ago

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…

53 minutes ago

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

2 hours ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

2 hours ago