Trends

ఏప్రిల్ 1 విడుద‌ల‌: మ‌ధ్య త‌ర‌గ‌తి గుండె గుభేల్‌!!

ఏప్రిల్ 1. సాధార‌ణంగా ప్ర‌తి నెల ప్రారంభ‌మ‌య్యేది 1వ తారీకుతోనే అయినా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 మాత్రం దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ పౌరులు, మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కేంద్రం గ‌త నెల‌లో ప్ర‌వేశ పెట్టిన సాధార‌ణ బ‌డ్జెట్ అమ‌ల్లోకి వ‌స్తుండ‌డ‌మే. ఈ బ‌డ్జెట్‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఎక్కువ‌గా వినియోగించే వ‌స్తుల‌పై ప‌న్నులు, ధ‌ర‌లు పెరుగుతుండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.

ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేది. కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఈ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ ఒకటి నుంచే చాలా మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అనేక ప్రతిపాదనలు అమలులోకి వచ్చేది ఈ తేదీ నుంచే. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల రూపంలో సామాన్యులపై భారంపడే అవకాశం కనిపిస్తోంది. విమానం ప్రయాణీకులు మరింత ఎక్కువ ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

కొత్త ఆర్థిక ఏడాది నుంచి కార్లు, బైక్‌ల ధరలు ప్రియం కాబోతున్నాయి. టీవీ, ఏసీలపై రూ. 3 వేల నుంచి 4వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తయారీ వ్యవయాలు పెరగడంతో ధరలు ప్రియం కాబోతున్నాయి. ఇక‌, ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిన ద‌రిమిలా అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు కూడా మండిపోతున్నాయి. వీకెండ్ పార్టీల‌కు ఒక‌ప్పుడు వెయ్యి రెండు వేల‌తో స‌రిపోయేది… కానీ, ఏప్రిల్ నుంచి మాత్రం వీటిపై ప‌న్నులు.. రెస్టారెంట్ చార్జీలు కూడా భారీ ఎత్తున మోగ‌నున్నాయి. దీంతో మ‌రో రెండు వేలు పెరిగినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

అదేవిధంగానూత‌న విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో పుస్త‌కాల‌పై పెరిగిన జీఎస్టీ మ‌రింత భారంగా మార‌నుంది. యూనిఫాంలు, పుస్త‌కాలు… పెన్సిళ్లు అన్నింటిని జీఎస్టీలోని 18 శాతం నుంచి 28 శాతం ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు. దీంత ఈ ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌నున్నాయి. అదేవిధంగా పెట్రోల్‌తో న‌డిచే వాహ‌నాల ధ‌ర‌లు ప‌ది వేల నుంచి 12 వేల వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. పోనీ బ్యాట‌రీ వాహ‌నాలు కొందామ‌న్నా.. ఈఎంఐ సౌక‌ర్యం ఎత్తేశారు.ఇలా ఒక్క‌టేమిటి.. అన్ని రూపాల్లోనూ ఏప్రిల్ 1 మ‌ధ్య‌త‌ర‌గతి జీవుల గుండెల‌ను గుభేల్ మ‌నేలా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 31, 2021 11:01 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

7 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

7 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

8 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

8 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

8 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

9 hours ago