పరుగు పందెం అన్నంతనే.. అందరికి గుర్తుకు వచ్చేస్తాడు ఉసేన్ బోల్ట్. ప్రపంచంలో వంద మీటర్ల పరుగు పందాన్ని అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసే అథ్లెట్ గా ఆయనకున్న కీర్తి ప్రతిష్ఠల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బోల్ట్ కు సరితూగే దేశీయ బోల్ట్ గా పిలుచుకునే పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ. కంబళ పోటీల్లో తొలిసారి ఉసేన్ బోల్ట్ ను మించిన రికార్డును నెలకొల్పి దేశ ప్రజలంతా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో..ఈ కర్ణాటక గ్రామీణ యువకుడి పేరు మారుమోగిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన పాల్గొన్న పరుగుల పోటీలో గతంలో తాను నెలకొల్పిన రికార్డును తాజాగా తానే బద్ధలుకొట్టాడు. ఈసారి వంద మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. తాజాగా కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో పరుగుల పోటీని నిర్వహించారు.
125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే..100 మీటర్ల ను 8.78 సెకన్లలో పూర్తి చేసినట్లుగా చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే తాను నెలకొల్పిన రికార్డును తాజాగా బ్రేక్ చేసి.. కొత్త రికార్డును తన పేరు మీద తిరిగి రాసుకున్నాడు. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…