పరుగు పందెం అన్నంతనే.. అందరికి గుర్తుకు వచ్చేస్తాడు ఉసేన్ బోల్ట్. ప్రపంచంలో వంద మీటర్ల పరుగు పందాన్ని అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసే అథ్లెట్ గా ఆయనకున్న కీర్తి ప్రతిష్ఠల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బోల్ట్ కు సరితూగే దేశీయ బోల్ట్ గా పిలుచుకునే పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ. కంబళ పోటీల్లో తొలిసారి ఉసేన్ బోల్ట్ ను మించిన రికార్డును నెలకొల్పి దేశ ప్రజలంతా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో..ఈ కర్ణాటక గ్రామీణ యువకుడి పేరు మారుమోగిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన పాల్గొన్న పరుగుల పోటీలో గతంలో తాను నెలకొల్పిన రికార్డును తాజాగా తానే బద్ధలుకొట్టాడు. ఈసారి వంద మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. తాజాగా కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో పరుగుల పోటీని నిర్వహించారు.
125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే..100 మీటర్ల ను 8.78 సెకన్లలో పూర్తి చేసినట్లుగా చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే తాను నెలకొల్పిన రికార్డును తాజాగా బ్రేక్ చేసి.. కొత్త రికార్డును తన పేరు మీద తిరిగి రాసుకున్నాడు. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
This post was last modified on March 30, 2021 11:39 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…