పరుగు పందెం అన్నంతనే.. అందరికి గుర్తుకు వచ్చేస్తాడు ఉసేన్ బోల్ట్. ప్రపంచంలో వంద మీటర్ల పరుగు పందాన్ని అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసే అథ్లెట్ గా ఆయనకున్న కీర్తి ప్రతిష్ఠల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బోల్ట్ కు సరితూగే దేశీయ బోల్ట్ గా పిలుచుకునే పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ. కంబళ పోటీల్లో తొలిసారి ఉసేన్ బోల్ట్ ను మించిన రికార్డును నెలకొల్పి దేశ ప్రజలంతా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో..ఈ కర్ణాటక గ్రామీణ యువకుడి పేరు మారుమోగిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన పాల్గొన్న పరుగుల పోటీలో గతంలో తాను నెలకొల్పిన రికార్డును తాజాగా తానే బద్ధలుకొట్టాడు. ఈసారి వంద మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. తాజాగా కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో పరుగుల పోటీని నిర్వహించారు.
125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే..100 మీటర్ల ను 8.78 సెకన్లలో పూర్తి చేసినట్లుగా చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే తాను నెలకొల్పిన రికార్డును తాజాగా బ్రేక్ చేసి.. కొత్త రికార్డును తన పేరు మీద తిరిగి రాసుకున్నాడు. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
This post was last modified on March 30, 2021 11:39 am
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…