కాలం మారింది. విలువలు మారాయి. తోటి మనుషుల వరకు ఎందుకు.. సుఖం కోసం సొంతోళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా చంపేసే పాడు కాలం వచ్చేసింది. తాము అనుకున్నది దక్కించుకోవటం కోసం దేనికైనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇప్పటి రోజుల్లో.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. విన్నంతనే ‘వావ్’ అనిపించే నిజాయితీ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.
కేరళలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఎర్నాకులానికి చెందిన స్మిజా దంపతులు లాటరీ టికెట్లు అమ్ముతుంటారు. రోజు మాదిరే వారి వ్యాపారం పూర్తి అయి ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఆ రోజు ఆదివారం కావటం.. ఆ రోజుకు గడువు పూర్తి అయ్యే పన్నెండు టికెట్లు మిగిలిపోయాయి. తమ వద్దే ఉంచుకుంటే నష్టం వస్తుంది. అందుకే..తమ దగ్గర లాటరీ టికెట్లు తరచూ కొనే రెగ్యులర్ కస్టమర్లకు ఫోన్లు చేశారు.
అలా పాలచోటిల్ కు చెందిన చంద్రన్ కు ఫోన్ చేసి.. తమ వద్ద ఉన్న పన్నెండు టికెట్ల గురించి చెప్పారు. అతను సరేనని చెప్పి.. తన దగ్గర రూ.200లు లేవని.. తర్వాతి రోజు ఇస్తానని చెప్పాడు. దీంతో.. అతనికి లాటరీ టికెట్ల నెంబర్లను ఫోన్లో చెప్పేసి ఇంటికి వెళ్లారు.
తర్వాతి రోజున చూస్తే.. వారు చివర్లో అమ్మిన పన్నెండు టికెట్లలో ఒక దానికి రూ.6కోట్ల బంపర్ ప్రైజ్ వచ్చింది. నిజానికి లాటరీ టికెట్ వారి వద్దే ఉన్నప్పటికీ.. చెప్పిన మాటకు లోబడి.. రూ.6కోట్ల ప్రైజ్ వచ్చిన చంద్రన్ ఇంటికి వెళ్లి.. రూ.6కోట్ల టికెల్ అతనికి ఇచ్చేశారు. తమకు రావాల్సిన రూ.200 తీసుకొని వెళ్లారు.
ఇవాల్టి రోజుల్లో ఇంతటి నిజాయితీని కలలో కూడా ఊహించగలమా? డబ్బుల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే రోజుల్లో చెప్పిన మాట మీద నిలిచిన స్మిజా దంపతులు రేర్ పీస్ గా చెప్పక తప్పదు. వీరి ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. వీరి గురించి తెలిసిన వారంతా వావ్ అనటమే కాదు.. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
This post was last modified on March 28, 2021 6:56 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…