చుట్టూ ఉన్న వారిని వదిలేసి.. ఏ మాత్రం పరిచయం లేని వారితో స్నేహం చేయటం.. వారితో సాన్నిహిత్యాన్ని కోరుకోవటం లాంటివి విన్నంతనే ఒకలాంటి ఉత్తేజాన్ని ఇస్తాయి. కానీ.. దాని వెనుక మోసం.. నమ్మకద్రోహంతో పాటు.. భారీగా ఇమేజ్ డ్యామేజ్ చేసే ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. కానీ.. వారు ఆ విషయాన్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది.
హైదరాబాద్ కు చెందిన ఒక వితంతువు.. డేటింగ్ యాప్ లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. అందులో రాజ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఇక్కడ రాజ్ గురించి కాస్త చెప్పాలి. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైనింగ్.. టీ కప్పులు తయారీ పరిశ్రమను నడిపేవాడు. అయితే.. వీటిల్లో నష్టాలు రావటంతో సులువుగా డబ్బులు సంపాదించటం కోసం డేటింగ్ యాప్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
తనకు పరిచయమైన వారికి తియ్యటి కబుర్లు చెప్పటం.. మాయమాటలతో సినిమా చూపించేయటం చేస్తాడు. సదరు హైదరాబాద్ వితంతువుకు ఇలాంటి బొమ్మనే చూపించిన అతగాడు.. తాను చేసే వ్యాపారానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. త్వరలో పెళ్లి చేసుకుందామన్న మాటతో పాటు.. ఆమె కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో.. అతడ్ని నమ్మిన ఆమె ఇప్పటివరకు రూ.3లక్షలు ఇచ్చింది.
డబ్బులు చేతిలో పడిన వెంటనే.. ఫోన్ బంద్ చేయటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించింది. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన వారు బెంగళూరులో రాజ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. డేటింగ్ యాప్ లు.. ఆన్ లైన్ పరిచయాల్ని ఏ మాత్రం నమ్మకూడదన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.
This post was last modified on March 20, 2021 11:47 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…