చుట్టూ ఉన్న వారిని వదిలేసి.. ఏ మాత్రం పరిచయం లేని వారితో స్నేహం చేయటం.. వారితో సాన్నిహిత్యాన్ని కోరుకోవటం లాంటివి విన్నంతనే ఒకలాంటి ఉత్తేజాన్ని ఇస్తాయి. కానీ.. దాని వెనుక మోసం.. నమ్మకద్రోహంతో పాటు.. భారీగా ఇమేజ్ డ్యామేజ్ చేసే ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. కానీ.. వారు ఆ విషయాన్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది.
హైదరాబాద్ కు చెందిన ఒక వితంతువు.. డేటింగ్ యాప్ లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. అందులో రాజ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఇక్కడ రాజ్ గురించి కాస్త చెప్పాలి. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైనింగ్.. టీ కప్పులు తయారీ పరిశ్రమను నడిపేవాడు. అయితే.. వీటిల్లో నష్టాలు రావటంతో సులువుగా డబ్బులు సంపాదించటం కోసం డేటింగ్ యాప్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
తనకు పరిచయమైన వారికి తియ్యటి కబుర్లు చెప్పటం.. మాయమాటలతో సినిమా చూపించేయటం చేస్తాడు. సదరు హైదరాబాద్ వితంతువుకు ఇలాంటి బొమ్మనే చూపించిన అతగాడు.. తాను చేసే వ్యాపారానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. త్వరలో పెళ్లి చేసుకుందామన్న మాటతో పాటు.. ఆమె కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో.. అతడ్ని నమ్మిన ఆమె ఇప్పటివరకు రూ.3లక్షలు ఇచ్చింది.
డబ్బులు చేతిలో పడిన వెంటనే.. ఫోన్ బంద్ చేయటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించింది. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన వారు బెంగళూరులో రాజ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. డేటింగ్ యాప్ లు.. ఆన్ లైన్ పరిచయాల్ని ఏ మాత్రం నమ్మకూడదన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.
This post was last modified on March 20, 2021 11:47 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…