Trends

బ్రేకింగ్.. భార‌త్‌-ఇంగ్లాండ్ టీ20లు ఖాళీ స్టేడియంలో

ఇండియాలో లాక్ డౌన్ ష‌ర‌తుల‌న్నీ ద‌శ‌లు వారీగా తొల‌గించేశారు. థియేట‌ర్ల‌లో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ రూల్ తొల‌గిపోయింది. స్టేడియాల్లోకి కూడా అభిమానుల‌ను అనుమ‌తించేస్తున్నారు. 50 శాతం మంది అభిమానుల‌తో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అభిమానుల‌కు అనుమ‌తులు లభించ‌గా.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును మాత్ర‌మే ఖాళీ స్టేడియంలో నిర్వ‌హించారు. త‌ర్వాత నుంచి స్టేడియాలు 50 శాతం ఆక్యుపెన్సీతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

ముఖ్యంగా ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన స్టేడియంగా అవ‌త‌రించిన మొతేరా మైదానంలో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతోనే ఎంతో సంద‌డి నెల‌కొంది. 60 వేల మందికి పైగా వీక్ష‌కుల‌తో స్టేడియం హోరెత్తింది. కానీ భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య మంగ‌ళ‌వారం జ‌రిగే మూడో టీ20 నుంచి మాత్రం స్టేడియంలో నిశ్శ‌బ్దం ఆవ‌హించ‌నుంది.

ఈ మ్యాచ్‌కే కాదు.. మొతేరాలోనే జ‌రిగే చివ‌రి రెండు టీ20ల‌కు కూడా అభిమానుల‌ను అనుమ‌తించ‌ట్లేదు. హ‌ఠాత్తుగా గుజ‌రాత్ క్రికెట్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మ‌దాబాద్‌లో క‌రోనా కేసులు నెమ్మ‌దిగా పెరుగుతున్న నేప‌థ్యంలో.. ఇలా వేల మందిని స్టేడియాల‌కు అనుమ‌తిస్తే వైర‌స్ ప్ర‌భావం పెరుగుతుంద‌న్న ఉద్దేశంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఖాళీ స్టేడియంలో నిశ్శ‌బ్దం మ‌ధ్య భార‌త్-ఇంగ్లాండ్ టీ20 చూడ‌టం ఇబ్బందిక‌ర‌మే అయినా ఇది అనివార్య‌మైంది. ఇప్ప‌టికే టికెట్లు కొన్న అభిమానుల‌కు డ‌బ్బులు వాప‌స్ చేయ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో ఆరంభ‌మ‌య్యే ఐపీఎల్‌ను పూర్తిగా అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. క‌రోనా ఇక త‌మ‌కు అడ్డం రాద‌ని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ.. మ‌ళ్లీ ఇలా ప్ర‌భావం చూపుతుంద‌ని వారు ఊహించి ఉండ‌రు.

This post was last modified on March 16, 2021 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago