Trends

బ్రేకింగ్.. భార‌త్‌-ఇంగ్లాండ్ టీ20లు ఖాళీ స్టేడియంలో

ఇండియాలో లాక్ డౌన్ ష‌ర‌తుల‌న్నీ ద‌శ‌లు వారీగా తొల‌గించేశారు. థియేట‌ర్ల‌లో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ రూల్ తొల‌గిపోయింది. స్టేడియాల్లోకి కూడా అభిమానుల‌ను అనుమ‌తించేస్తున్నారు. 50 శాతం మంది అభిమానుల‌తో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అభిమానుల‌కు అనుమ‌తులు లభించ‌గా.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును మాత్ర‌మే ఖాళీ స్టేడియంలో నిర్వ‌హించారు. త‌ర్వాత నుంచి స్టేడియాలు 50 శాతం ఆక్యుపెన్సీతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

ముఖ్యంగా ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన స్టేడియంగా అవ‌త‌రించిన మొతేరా మైదానంలో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతోనే ఎంతో సంద‌డి నెల‌కొంది. 60 వేల మందికి పైగా వీక్ష‌కుల‌తో స్టేడియం హోరెత్తింది. కానీ భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య మంగ‌ళ‌వారం జ‌రిగే మూడో టీ20 నుంచి మాత్రం స్టేడియంలో నిశ్శ‌బ్దం ఆవ‌హించ‌నుంది.

ఈ మ్యాచ్‌కే కాదు.. మొతేరాలోనే జ‌రిగే చివ‌రి రెండు టీ20ల‌కు కూడా అభిమానుల‌ను అనుమ‌తించ‌ట్లేదు. హ‌ఠాత్తుగా గుజ‌రాత్ క్రికెట్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మ‌దాబాద్‌లో క‌రోనా కేసులు నెమ్మ‌దిగా పెరుగుతున్న నేప‌థ్యంలో.. ఇలా వేల మందిని స్టేడియాల‌కు అనుమ‌తిస్తే వైర‌స్ ప్ర‌భావం పెరుగుతుంద‌న్న ఉద్దేశంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఖాళీ స్టేడియంలో నిశ్శ‌బ్దం మ‌ధ్య భార‌త్-ఇంగ్లాండ్ టీ20 చూడ‌టం ఇబ్బందిక‌ర‌మే అయినా ఇది అనివార్య‌మైంది. ఇప్ప‌టికే టికెట్లు కొన్న అభిమానుల‌కు డ‌బ్బులు వాప‌స్ చేయ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో ఆరంభ‌మ‌య్యే ఐపీఎల్‌ను పూర్తిగా అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. క‌రోనా ఇక త‌మ‌కు అడ్డం రాద‌ని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ.. మ‌ళ్లీ ఇలా ప్ర‌భావం చూపుతుంద‌ని వారు ఊహించి ఉండ‌రు.

This post was last modified on March 16, 2021 10:15 am

Share

Recent Posts

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

4 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

5 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

4 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

4 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

5 hours ago