షాకింగ్ హత్య ఒకటి వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. కనిపించకుండా పోయాడనుకున్న వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురై.. అదే ఇంట్లోనే పాతి పెట్టేశారన్న దారుణ నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అసలేం జరిగిందంటే..
రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గత జూన్ లో నౌసిన్ బేగంను పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందని భావిస్తున్న వేళ.. గత నెల (ఫిబ్రవరి 8న) కనిపించకుండా పోయాడు. అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు జరుపుతున్నారు. తన సోదరుడు మిస్సింగ్ కేసు గురించి గగన్ సోదరుడు పోలీసుల్ని తరచూ వాకబు చేసేవాడు.
విచారణ జరిపిన పోలీసులకు సందేహం వచ్చి ఇంట్లో తనిఖీ నిర్వహించగా.. భర్తను ఇంట్లో చంపేసి పూడ్చి పెట్టేసిన వైనం వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను దారుణంగా చంపేయటం ఒక ఎత్తు కాగా.. ఇంట్లోనే పూడ్చేసి ఏమీ తెలియనిదానిలా ఉన్న ఆమె తీరుకు షాక్ తింటున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on March 10, 2021 7:06 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…