భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లి గురించి కొన్ని రోజులుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు నుంచి వ్యక్తిగత కారణాలు చెప్పి తప్పుకున్నప్పటి నుంచి అతడి వివాహం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అతను పెళ్లి చేసుకోబోతుండటం వాస్తవమే కానీ.. వధువు ఎవరనే విషయంలోనే సస్పెన్స్ నడిచింది. దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్తో బుమ్రా వివాహం అంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది.
ఇంతకుముందే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. కానీ ఎన్నడూ వాళ్లిద్దరూ కలిసి కనిపించిన దాఖలాలే లేవు. ఐతే బుమ్రా పెళ్లి కోసం సెలవు తీసుకున్న సమయంలోనే అనుపమ.. తనకు హాలిడే వచ్చినట్లు, గుజరాత్కు వెళ్తున్నట్లు వేర్వేరుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో.. రెంటికీ లింకు కలిపి ఇద్దరి పెళ్లి గురించి ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిపోయారు రూమర్ రాయుళ్లు.
ఐతే అనుపమ పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఆమె తల్లి ఖండించడంతో ఆ ప్రచారం కొంచెం సద్దుమణిగింది. కానీ బుమ్రా నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాడా, ఆ అమ్మాయి ఎవరనే సస్పెన్స్ పెరిగిపోయింది. ఈ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన గణేశన్ అనే అమ్మాయిని బుమ్రా పెళ్లాడబోతున్నాడట. ఈమె ఐపీఎల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ తరఫున కోల్కతా నుంచి పని చేసింది. ఐపీఎల్ కోసం బుమ్రా కోల్కతాకు వెళ్లినపుడే ఇద్దరి మధ్య పరిచయం జరిగి.. అది ప్రేమకు దారి తీసినట్లుంది.
వీళ్లిద్దరి పెళ్లి ఈ నెల 14-15 తేదీల మధ్య గోవాలో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య జరగనుందట. ఈ కారణంతోనే బుమ్రా ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్కు కూడా దూరమైనట్లు సమాచారం. కర్ణాటక ఆటగాడు స్టువర్ట్ బిన్నీ కూడా టాప్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన మయంతి లాంగర్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మరో స్పోర్ట్స్ ప్రెజెంటర్ శిబాని దండేకర్.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్తో సెటిలైన సంగతి విదితమే.
This post was last modified on March 9, 2021 2:21 pm
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…
పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…
'ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…