Trends

ఐపీఎల్ షెడ్యూల్ ఫిక్స్.. మనకు అన్యాయమే


ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ షెడ్యూల్ విషయంలో నెలకొన్న సస్పెన్సుకి ఎట్టకేలకు తెరపడింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఏప్రిల్ 9న ఈ మెగా టోర్నీ మొదలు కాబోతోంది. అనుకున్నట్లుగానే టోర్నీ వేదికల నుంచి సన్‌రైజర్స్ హోం సిటీ అయిన హైదరాబాద్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్ జట్ల సొంత నగరాలైన మొహాలి, జైపూర్‌లను తప్పించారు. దక్షిణాదిన మిగతా రెండు వేదికలైన చెన్నై, బెంగళూరుల్లో మాత్రం మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అలాగే ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలను కూడా కొనసాగించనున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దుకున్న అహ్మదాబాద్‌లోని మొతేరా మైదానాన్ని ఆరో వేదికగా ఎంపిక చేశారు. కరోనా నేపథ్యంలో వేదికల సంఖ్య తగ్గించాలని బీసీసీఐ భావించడంతోనే ఈ మార్పు చోటు చేసుకుంది. ఐతే ఇంతా చేసి తగ్గించింది రెండు వేదికలనే. అసలు ఏ ఫ్రాంఛైజీకి హోం సిటీ కాని అహ్మాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని పట్టుబట్టి కూర్చోవడమే విడ్డూరం.

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన అతి పెద్ద స్టేడియానికి ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించడం బీసీసీఐ కార్యదర్శి, హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా చక్రం తిప్పారనడంలో సందేహం లేదు. ఆ స్టేడియం వల్లే హైదరాబాద్ అవకాశం కోల్పోయింది. జైపూర్, మొహాలిలతో పోలిస్తే హైదరాబాద్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకూ ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇంత పేరున్న, మహా నగరంలో ఈసారి ఐపీఎల్ జరగకపోవడం కచ్చితంగా అన్యాయమే. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ముంబయిలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ ఆ నగరానికి ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారు. కరోనా భయంతోనే వేదికల సంఖ్య తగ్గించినట్లు చెబుతున్న బీసీసీఐ.. ముంబయిని ఎంపిక చేయడంలో ఔచిత్యమేంటో? ఐపీఎల్-14 మే 30న ముగియనుండగా.. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోనే నిర్వహించబోతుండటం గమనార్హం.

Satya

Recent Posts

పెద్ద చేయి అందుకున్న నైజామ్ ప్యారడైజ్

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…

7 hours ago

అభిమానం స‌రే… ప‌వ‌న్‌ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్‌!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు ప‌రామ‌ర్శ‌లు వెల్లువ‌లా త‌ర‌లి వ‌స్తున్నాయి. ఏపీ స‌హా తెలంగాణ…

7 hours ago

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

8 hours ago

తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…

9 hours ago

మా ఇంటి బంగారం… వివాదానికి తెర?

గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…

9 hours ago

20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?

భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…

10 hours ago