అయ్యో అన్న వేదనకు కలిగించే ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి అమెరికాలో ఐటీ ఎంప్లాయ్ గా పని చేస్తోంది. ఆమె సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి.. అనుకోని రీతిలో ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్ని నింపింది. ఇంతకూ ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే..
చిత్తూరు పట్టణంలోని పోలీసుల కాలనీకి చెందిన సుష్మా అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్నారు. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ఆమెకు.. తమ జిల్లాలోని పూతలపట్టు ప్రాంతానికి చెందిన భరత్ తో పెళ్లి ఫిక్స్ అయ్యింది. త్వరలో పెళ్లి జరగాల్సిన వేళలో.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని కాన్సిల్ చేసుకున్నారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోనే ఉంటున్న సుష్మ సోదరుడు.. తన చెల్లి ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చిత్తూరులోని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో.. వారి కుటుంబం శోక సందంలో మునిగింది. త్వరలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. తీరని శోకం చోటు చేసుకోవటం పలువురిని కలిచివేసింది. తమ కుమార్తెకు ఆత్మహత్యకు కారణంగా.. వరుడి కుటుంబమే అంటూ సుష్మ తల్లిదండ్రులు వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో రెండు రోజుల్లో సుష్మ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on March 5, 2021 10:31 am
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…