అయ్యో అన్న వేదనకు కలిగించే ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి అమెరికాలో ఐటీ ఎంప్లాయ్ గా పని చేస్తోంది. ఆమె సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి.. అనుకోని రీతిలో ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్ని నింపింది. ఇంతకూ ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే..
చిత్తూరు పట్టణంలోని పోలీసుల కాలనీకి చెందిన సుష్మా అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్నారు. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ఆమెకు.. తమ జిల్లాలోని పూతలపట్టు ప్రాంతానికి చెందిన భరత్ తో పెళ్లి ఫిక్స్ అయ్యింది. త్వరలో పెళ్లి జరగాల్సిన వేళలో.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని కాన్సిల్ చేసుకున్నారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోనే ఉంటున్న సుష్మ సోదరుడు.. తన చెల్లి ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చిత్తూరులోని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో.. వారి కుటుంబం శోక సందంలో మునిగింది. త్వరలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. తీరని శోకం చోటు చేసుకోవటం పలువురిని కలిచివేసింది. తమ కుమార్తెకు ఆత్మహత్యకు కారణంగా.. వరుడి కుటుంబమే అంటూ సుష్మ తల్లిదండ్రులు వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో రెండు రోజుల్లో సుష్మ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…
లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో…
జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా…