Trends

డ్రాగ‌‌న్ ఎఫెక్ట్‌…. అప‌ర కుబేరుడు.. అట్ట‌డుగుకు..

ఆయ‌న అప‌ర కుబేరుడు. ఒక ద‌శలో ఈ హోల్ ప్ర‌పంచం మొత్తం ఆయ‌న‌ను చూసి గ‌ర్వించింది. చూసేందుకు పొట్టిగా.. బ‌క్క‌ప‌ల‌చ‌గా.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న బుర్ర ఐడియాల తొర్ర‌.. అని! ఆయ‌న వ్యాపార సామ్రాజ్యం.. అన‌న్య‌సామాన్య‌మ‌ని.. ప్ర‌పంచం మోసేసింది. ఆయ‌న నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌ని భార‌త్ స‌హా అనేక దేశాలు ప్ర‌క‌టించి.. త‌మ త‌మ దేశాల‌కు రావాలంటూ.. ఆహ్వానాలు కూడా పంపాయి. అయితే.. ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.! ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.. అలీబాబా గ్రూప్ అధినేత‌.. జాక్ మా.. ఆయ‌న అస‌లు పేరు మా య‌న్‌.

ఒక‌ప్పుడు ఏ రేంజ్‌లో అయితే..ఈ ప్ర‌పంచం జాక్ మా గురించి ప్ర‌సంశ‌లు కురిపించిందో.. ఇప్పుడు అంతే రేంజ్‌లో సింప‌తీ చూపిస్తోంది. దీనికి కార‌ణం.. ఏంటి? ఎందుకు అంత ఎత్తుకు ఎదిగి ఒక్క‌సారిగా కుప్ప‌కూలారు? ఇప్పుడు అస‌లు ఏమైంది? ఇదీ.. మేధావుల నుంచి వ్యాపార దిగ్గ‌జాల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రినీ ఉత్కంఠ‌కు గురి చేస్తున్న ప్ర‌శ్న‌లు. మ‌రి ఈ విష‌యం తెలియాలంటే.. ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే!

చైనాకు చెందిన జాక్ మా(56ఏళ్ల వ‌య‌సు) అత్యంత త‌క్కువ పెట్టుబ‌డితో అలీబాబా కంపెనీని స్థాపించారు. ఆయ‌న నిరంత‌ర కృషి.. ప‌ట్టుద‌ల‌తో కూడిన ల‌క్ష్యంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా ఆయ‌న పుంజుకున్నారు. ఆయ‌న వ్యాపారాల‌కు అనేక దేశాలు ఫిదా అయ్యాయి. ‘అలీబాబా కథల్లో దాగిన నిధుల్ని వెలికితీ స్తాడు. మేం ఈ-కామర్స్ సామ్రాజ్యంలో ఆ పని చేస్తామన్న అర్థమూ ఉంది’ అంటాడు జాక్. చాలా ఐటీ కంపెనీల మాదిరిగానే అలీబాబా కూడా దాని వ్యవస్థాపకుడి ఇంట్లోనే మొగ్గ తొడిగింది. మిగతా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల మాదిరిగా వ్యాపారికీ, వినియోగదారుడికీ మధ్య వారధిగా కాకుండా వ్యాపారికీ-వ్యాపారికీ మధ్య వారధిగా ఏర్పడింది అలీబాబాడాట్‌కామ్.

చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను గుర్తించి జాక్ ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. దుస్తులూ గృహోపకరణాల అమ్మకాలూ కొనుగోళ్లు చేసే సంస్థలకు ఇదో ప్రపంచస్థాయి మార్కెట్‌. ఆ విధానంతో మూడేళ్లపాటు వేగంగా అభివృద్ధి చెందింది అలీబాబా. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చైనా దేశ అగ్ర ఆర్థిక వేత్త‌ల్లో ఒక‌రుగా ఎదిగారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న ఇప్పుడు కుబేరుడి స్థానం నుంచి దిగ‌జారి పోయారు.. ‘హురున్ గ్లోబల్ రిచ్’ జాబితా ప్రకారం చైనా ధనవంతుల జాబితాలో ఆయన ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. మరోవైపు ఆయన వ్యాపార ప్రత్యర్థుల సంపద భారీగా పెర‌గడం గమనార్హం.

గతేడాది అక్టోబరులో చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన నాటి నుంచి జాక్ మాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయన వ్యాపారాలపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. 37 బిలియన్ డాలర్ల విలువ చేసే యాంట్ గ్రూప్ ఐపీవోను అడ్డుకుంది. చైనా విడుదల చేసిన టెక్ దిగ్గజాల జాబితా నుండి జాక్ మాను పక్కన పెట్టింది. ఓ సమయంలో జాక్ మా కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. దాదాపు రెండు నెలల తర్వాత వర్చువల్ భేటీలో కనిపించారు. ఇక ఇప్పుడు ఆయన చైనా కుబేరుడి స్థానాన్ని కోల్పోయారు.

వాస్త‌వానికి జాక్ మా, ఆయన కుటుంబం 2019, 2020 ల్లో వరుసగా రెండుసార్లు చైనా కుబేరుల్లో మొదటి స్థానం దక్కించుకుంది. ఈసారి మాత్రం చైనా కుబేరుడిగా ఈ దఫా నాంగ్‌వూ స్ప్రింగ్ కంపెనీ అధినేత జోంగ్ షాన్‌షాన్ నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ పోనీ మా, ఈ కామర్స్‌ పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ నిలిచారు. జోంగ్ ఆదాయం గత సంవత్సర కాలంలో అనూహ్యంగా 85 బిలియన్ డాలర్లకు పెరిగింది. టెన్సెంట్ అధినేత సంపద 70 శాతం ఎగబాకి 74.19 బిలియన్ డాలర్లకు, హువాంగ్ సంపద 283 శాతం ఎగిసి 69.55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జాక్ మా, ఆయన ఫ్యామిలీ సంపద ఏడాది వ్యవధిలో 22 శాతం పెరిగి 55.64 బిలియన్ డాలర్లగా ఉంది.

This post was last modified on March 4, 2021 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

34 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago