Trends

భారత్ వ్యాక్సిన్ – నీచానికి దిగజారిన చైైనా

డ్రాగన్ దేశం తెంపరితనం ప్రపంచానికి తెలిసిందే కానీ మరీ ఇంత నీచానికి దిగజారిపోతుందని ఎవరు అనుకోలేదు. మనదేశంలో తయారవుతున్న కరోనా వైరస్ టీకా వివరాలను దొంగలించేందుకు పెద్ద ప్రయత్నమే చేసింది. సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఫార్ములాలను, తయారీ విధానాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేసినట్లు తాజాగా బయటపడింది.

భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ వివరాలను దొంగలించేందుకు సీరం ఇన్ స్టిట్యూట్ కంపెనీ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టినట్లు సైబర్ సెక్యురిటి సై ఫార్మా బయటపెట్టింది. సీరమ్ తో పాటు భారత్ బయోటెక్ సంస్ధలకు చెందిన కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టడాన్ని తాము గుర్తించినట్లు సైబర్ సెక్యురిటి ప్రకటించిటం సంచలనంగా మారింది.

చైనా హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా పై రెండు సంస్ధల్లోని ఐటి వ్యవస్ధల్లో ఉన్న లోపాల ఆధారంగా మాల్ వేర్ ను చొప్పించింది. వ్యాక్సినేషన్ వివరాలను దొంగిలించి మేథోసంపత్తి హక్కుల వివరాలను కూడా తస్కరిచిం ఫార్మా కంపెనీలపై ఆధిపత్యం సాధించాలన్నది చైనా ఎత్తుగడగా అర్ధమవుతోంది. ఎప్పుడైతే అనుమానం వచ్చి మాల్ వేర్ చొప్పించినట్లు గ్రహించారో వెంటనే సీరం కంపెనీకి చెందిన ఐటి వ్యవస్ధలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

కరోనా వైరస్ టీకాలను చైనా కూడా తయారుచేస్తున్న ప్రపంచంలో వాడుతున్న టీకాల్లో 60 శాతంకు పైగా మనదేశంలో తయారైనవే. దాంతో చైనాకు మండిపోతోంది. అందుకనే భారత్ ను ఎలాగైనా దెబ్బకొట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియలో పై చేయి సాధించాలని అనుకున్నది. కాకపోతే ప్రారంభంలోనే మాల్ వేర్ ను గుర్తించటంతో సమస్య తప్పింది. అయితే ఈ విషయాన్ని పై రెండు కంపెనీలు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. చూడాలి కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

3 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

5 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago