డ్రాగన్ దేశం తెంపరితనం ప్రపంచానికి తెలిసిందే కానీ మరీ ఇంత నీచానికి దిగజారిపోతుందని ఎవరు అనుకోలేదు. మనదేశంలో తయారవుతున్న కరోనా వైరస్ టీకా వివరాలను దొంగలించేందుకు పెద్ద ప్రయత్నమే చేసింది. సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఫార్ములాలను, తయారీ విధానాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేసినట్లు తాజాగా బయటపడింది.
భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ వివరాలను దొంగలించేందుకు సీరం ఇన్ స్టిట్యూట్ కంపెనీ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టినట్లు సైబర్ సెక్యురిటి సై ఫార్మా బయటపెట్టింది. సీరమ్ తో పాటు భారత్ బయోటెక్ సంస్ధలకు చెందిన కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టడాన్ని తాము గుర్తించినట్లు సైబర్ సెక్యురిటి ప్రకటించిటం సంచలనంగా మారింది.
చైనా హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా పై రెండు సంస్ధల్లోని ఐటి వ్యవస్ధల్లో ఉన్న లోపాల ఆధారంగా మాల్ వేర్ ను చొప్పించింది. వ్యాక్సినేషన్ వివరాలను దొంగిలించి మేథోసంపత్తి హక్కుల వివరాలను కూడా తస్కరిచిం ఫార్మా కంపెనీలపై ఆధిపత్యం సాధించాలన్నది చైనా ఎత్తుగడగా అర్ధమవుతోంది. ఎప్పుడైతే అనుమానం వచ్చి మాల్ వేర్ చొప్పించినట్లు గ్రహించారో వెంటనే సీరం కంపెనీకి చెందిన ఐటి వ్యవస్ధలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కరోనా వైరస్ టీకాలను చైనా కూడా తయారుచేస్తున్న ప్రపంచంలో వాడుతున్న టీకాల్లో 60 శాతంకు పైగా మనదేశంలో తయారైనవే. దాంతో చైనాకు మండిపోతోంది. అందుకనే భారత్ ను ఎలాగైనా దెబ్బకొట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియలో పై చేయి సాధించాలని అనుకున్నది. కాకపోతే ప్రారంభంలోనే మాల్ వేర్ ను గుర్తించటంతో సమస్య తప్పింది. అయితే ఈ విషయాన్ని పై రెండు కంపెనీలు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. చూడాలి కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.
This post was last modified on March 2, 2021 10:48 am
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…