హైదరాబాద్ మహానగరంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకు పలికిన ధరలకు భిన్నంగా సంపన్నులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఇంటి స్థలాన్ని రికార్డు ధరకు కొనుగోలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫార్మా కంపెనీ అధినేత ఒకరు భారీ మొత్తాన్ని వెచ్చింది ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 1837 చదరపు గజాల కోసం ఏకంగా రూ.41.3 కోట్ల మొత్తాన్ని వెచ్చించిన వైనం ఇప్పుడు సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో ఒక ఇంటి స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ లావాదేవీ కోసం రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం చెల్లించిన స్టాంపు డ్యూటీ భారీగా ఉందంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం బయటకు వచ్చిన అనధికారిక సమాచరం ఏమంటే.. 1837 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కోసం ప్రభుత్వానికి చెల్లించిన స్టాంపు డ్యూటీనే రూ.2.27 కోట్లుగా చెబుతున్నారు. దీనికి అదనంగా మరో రూ.20లక్షల మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు.
జనవరి 28న జరిగిన ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా.. తాజాగా బయటకు వచ్చాయి. ఒక ఫార్మా కంపెనీ అధినేత ఈ భారీ మొత్తానికి స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజా లావాదేవీ ప్రకారం జూబ్లీహిల్స్ లో గజం భూమి విలువ రూ.2.2లక్షలుగా తేలింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గజం భూమి విలువ రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోందని..
తాజా లావాదేవీతో కొత్త రికార్డు నమోదైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదేమీ అసాధారణం ఏమీ కాదన్న మాట వినిపిస్తున్నా.. కరోనా తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత దూకుడుగా ఉందన్న విషయం తాజా లావాదేవీ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. అధికారికంగానే ఇంత ఉంటే.. అనధికారికంగా మరికొంత ధర ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…