షాకింగ్ పరిణామం బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇరవై రోజులకు కరోనా పాజిటివ్ నమోదైన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త భయాలకు తెర తీసేలా తాజా పరిణామం నెలకొంది. అది కూడా.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది వైద్య సిబ్బంది విషయంలో చోటు చేసుకున్న ఈ వైనం.. ఏ మాత్రం మింగుడు పడటం లేదు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఇలా జరిగింది.
20 రోజుల క్రితం ఎనిమిది మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు కాగా.. ఆరుగురు వైద్య సిబ్బంది. అయితే.. ఈ ఎనిమిది మందిలో ఒకరు తప్పించి మిగిలిన ఏడుగురు ఆపరేషన్ థియేటర్ కు చెందిన వారే. తాజాగా వీరందరికి కరోనా లక్షణాలు కనిపించటంతో.. ఆరుగురిని కరోనా వార్డులో.. ఇద్దరు హోం ఐసోలేషన్ లో చికిత్స చేస్తున్నారు. ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కొత్తగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. అదే సమయంలో 86 మంది ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. తాజాగా నమోదైన 149 మంది కరోనాతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.95 లక్షల మందికి పాజిటివ్ రాగా.. 1612 మంది మరణించారు. 2.92లక్షల మంది ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. మొత్తం కేసుల్లో పాతిక మంది గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన వారు కావటం గమనార్హం.
This post was last modified on February 10, 2021 10:08 am
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…