ఇండియాలో ఇప్పటికే వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సౌజన్యంతో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన ‘కోవిషీల్డ్’తో పాటుగా దేశీయ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాగ్జిన్’లను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజూ లక్షలమందికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఐతే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రభుత్వం అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి ఏళ్ల సమయం పట్టేలా ఉంది.
ఈ నేపథ్యంలో విదేశాల్లో తయారైన కొన్ని ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్లకు ఇండియాలో అనుమతులిచ్చి ప్రైవేట్ సెంటర్లలో జనాలు నేరుగా టీకా వేయించుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇండియాలో చాలామంది ధనవంతుల దృష్టి ప్రఖ్యాత ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ మీద ఉంది. అమెరికాలో ప్రస్తుతం వేస్తున్నది ఈ కంపెనీ టీకానే. దాని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది.
ఐతే మన లోకల్ వ్యాక్సిన్ల కంటే ఫైజర్ మీద ఎక్కువ గురి ఉన్న ధనవంతులు ఇండియాలోకి ఫైజర్ వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ ఇండియాలో ప్రవేశానికి అనుమతులు కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి మొండిచేయి చూపించింది. అత్యవసర అనుమతుల కోసం ఫైజర్ సంస్థ చేసిన విజ్ఞప్తిని భారత ఔషధ నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ తిరస్కరించింది.
ఫైజర్ సమర్పించిన డేటా సంతృప్తికరంగా లేదని, ఈ వ్యాక్సిన్ భారతీయులకు సురక్షితం అనడానికి తగ్గ ఆధారాలు ఇందులో లేవని పేర్కొంటూ ఫైజర్కు అనుమతులు నిరాకరించింది. అగ్ర రాజ్యం అమెరికాలో అనుమతులు పొందిన, ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న కొవిడ్ వ్యాక్సిన్లలో అత్యుత్తమమైంది కాగలదని ముందు నుంచి నిపుణులు పేర్కొంటున్న వ్యాక్సిన్కు ఇండియాలో ఇలా తిరస్కారం ఎదురు కావడం ఆశ్చర్యమే. అదే సమయంలో మన కోవాగ్జిన్కు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు దక్కడం విశేషం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…