చైనాలో తయారైన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు బయటపడటం సంచలనంగా మారింది. అసలే కరోనా వైరస్ కు డ్రాగన్ పుట్టిల్లనే విషయంపై యావత్ ప్రపంచదేశాలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే జంతువుల ద్వారానే కాకుండా చివరకు తినే ఆహారపదార్ధాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం బయటపడటంతో జనాల్లో కలకలం రేగుతోంది. బీజింగ్ కు సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో మల్టీనేషనల్ స్ధాయి ఉన్న ఐస్ క్రీం తయారీ కంపెనీ ఉంది.
ఆ కంపెనీ తయారుచేసిన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. ఐస్ క్రీంలో కరోనా వైరస్ ఆనవాళ్ళు ఎలాగ కనిపించాయి ? ఎవరు గమనించారు ? అనే విషయాలు ఇంకా నిర్ధారణకాలేదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో సదరు కంపెనీ తాను తయారుచేసి సరఫరా చేసిన వేలాది కిలోల ఐస్ క్రీం కార్టన్లను మాత్రం వెనక్కు తెప్పించేసుకుంటోంది.
అయితే ఆరోపణలకు గురైనా కంపెనీ యాజమాన్యం మాత్రం తాము తయారుచేసిన ఐస్ క్రీం ఉత్పత్తుల్లో 390 కార్టన్లను మాత్రమే అమ్మకాలు జరిపినట్లు చెబుతోంది. 29 వేల కార్టన్లు ఇంకా తమ వద్దే ఉండిపోయిన విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా అమ్మిన 390 కార్టన్ల ఐస్ క్రీం కార్టన్లు ఏ ప్రాంతాలకు వెళ్ళింది, అక్కడ నుండి ఎవరెవరు కొనుగోళ్ళు చేశారనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం సహకారంతో అధికారులు ట్రేస్ చేస్తున్నారు.
ఇదంతా ఇలాగుంటే ఐస్ క్రీం తయారుచేసిన కంపెనీ మాత్రం తాము దిగుమతి చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ద్వారా మాత్రమే కరోనా వైరస్ వచ్చి ఉండవచ్చని వాదిస్తోంది. ఐస్ క్రీం తయారీలో వాడే ఆహార ముడి పదార్ధాలను న్యూజిల్యండ్, ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ కరోనా వైరస్ వచ్చుంటే ఆహారముడి పదార్ధాల ద్వారానే వచ్చి ఉండాలని మొత్తుకుంటోంది. ఏదేమైనా ఐస్ క్రీం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం ఇపుడు సంచలనంగా మారింది. అందుకనే కంపెనీలోని సిబ్బంది మొత్తాన్ని చైనా ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది.
This post was last modified on January 18, 2021 11:02 am
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…