చైనాలో తయారైన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు బయటపడటం సంచలనంగా మారింది. అసలే కరోనా వైరస్ కు డ్రాగన్ పుట్టిల్లనే విషయంపై యావత్ ప్రపంచదేశాలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే జంతువుల ద్వారానే కాకుండా చివరకు తినే ఆహారపదార్ధాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం బయటపడటంతో జనాల్లో కలకలం రేగుతోంది. బీజింగ్ కు సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో మల్టీనేషనల్ స్ధాయి ఉన్న ఐస్ క్రీం తయారీ కంపెనీ ఉంది.
ఆ కంపెనీ తయారుచేసిన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. ఐస్ క్రీంలో కరోనా వైరస్ ఆనవాళ్ళు ఎలాగ కనిపించాయి ? ఎవరు గమనించారు ? అనే విషయాలు ఇంకా నిర్ధారణకాలేదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో సదరు కంపెనీ తాను తయారుచేసి సరఫరా చేసిన వేలాది కిలోల ఐస్ క్రీం కార్టన్లను మాత్రం వెనక్కు తెప్పించేసుకుంటోంది.
అయితే ఆరోపణలకు గురైనా కంపెనీ యాజమాన్యం మాత్రం తాము తయారుచేసిన ఐస్ క్రీం ఉత్పత్తుల్లో 390 కార్టన్లను మాత్రమే అమ్మకాలు జరిపినట్లు చెబుతోంది. 29 వేల కార్టన్లు ఇంకా తమ వద్దే ఉండిపోయిన విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా అమ్మిన 390 కార్టన్ల ఐస్ క్రీం కార్టన్లు ఏ ప్రాంతాలకు వెళ్ళింది, అక్కడ నుండి ఎవరెవరు కొనుగోళ్ళు చేశారనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం సహకారంతో అధికారులు ట్రేస్ చేస్తున్నారు.
ఇదంతా ఇలాగుంటే ఐస్ క్రీం తయారుచేసిన కంపెనీ మాత్రం తాము దిగుమతి చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ద్వారా మాత్రమే కరోనా వైరస్ వచ్చి ఉండవచ్చని వాదిస్తోంది. ఐస్ క్రీం తయారీలో వాడే ఆహార ముడి పదార్ధాలను న్యూజిల్యండ్, ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ కరోనా వైరస్ వచ్చుంటే ఆహారముడి పదార్ధాల ద్వారానే వచ్చి ఉండాలని మొత్తుకుంటోంది. ఏదేమైనా ఐస్ క్రీం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం ఇపుడు సంచలనంగా మారింది. అందుకనే కంపెనీలోని సిబ్బంది మొత్తాన్ని చైనా ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…