చైనాలో తయారైన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు బయటపడటం సంచలనంగా మారింది. అసలే కరోనా వైరస్ కు డ్రాగన్ పుట్టిల్లనే విషయంపై యావత్ ప్రపంచదేశాలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే జంతువుల ద్వారానే కాకుండా చివరకు తినే ఆహారపదార్ధాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం బయటపడటంతో జనాల్లో కలకలం రేగుతోంది. బీజింగ్ కు సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో మల్టీనేషనల్ స్ధాయి ఉన్న ఐస్ క్రీం తయారీ కంపెనీ ఉంది.
ఆ కంపెనీ తయారుచేసిన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. ఐస్ క్రీంలో కరోనా వైరస్ ఆనవాళ్ళు ఎలాగ కనిపించాయి ? ఎవరు గమనించారు ? అనే విషయాలు ఇంకా నిర్ధారణకాలేదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో సదరు కంపెనీ తాను తయారుచేసి సరఫరా చేసిన వేలాది కిలోల ఐస్ క్రీం కార్టన్లను మాత్రం వెనక్కు తెప్పించేసుకుంటోంది.
అయితే ఆరోపణలకు గురైనా కంపెనీ యాజమాన్యం మాత్రం తాము తయారుచేసిన ఐస్ క్రీం ఉత్పత్తుల్లో 390 కార్టన్లను మాత్రమే అమ్మకాలు జరిపినట్లు చెబుతోంది. 29 వేల కార్టన్లు ఇంకా తమ వద్దే ఉండిపోయిన విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా అమ్మిన 390 కార్టన్ల ఐస్ క్రీం కార్టన్లు ఏ ప్రాంతాలకు వెళ్ళింది, అక్కడ నుండి ఎవరెవరు కొనుగోళ్ళు చేశారనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం సహకారంతో అధికారులు ట్రేస్ చేస్తున్నారు.
ఇదంతా ఇలాగుంటే ఐస్ క్రీం తయారుచేసిన కంపెనీ మాత్రం తాము దిగుమతి చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ద్వారా మాత్రమే కరోనా వైరస్ వచ్చి ఉండవచ్చని వాదిస్తోంది. ఐస్ క్రీం తయారీలో వాడే ఆహార ముడి పదార్ధాలను న్యూజిల్యండ్, ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ కరోనా వైరస్ వచ్చుంటే ఆహారముడి పదార్ధాల ద్వారానే వచ్చి ఉండాలని మొత్తుకుంటోంది. ఏదేమైనా ఐస్ క్రీం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం ఇపుడు సంచలనంగా మారింది. అందుకనే కంపెనీలోని సిబ్బంది మొత్తాన్ని చైనా ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది.
This post was last modified on January 18, 2021 11:02 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…