హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత భారత్కు తిరిగి వచ్చేలా రిటర్న్ టికెట్ కూడా ముందే బుక్ చేసుకున్నారు. కానీ అమెరికా ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు మాత్రం రెండు నెలల వరకు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఐదు నెలల ట్రిప్ ప్లాన్ చేసిన కుటుంబం ఇప్పుడు రెండు నెలల్లోనే తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అమెరికా వీసా ఉన్నప్పుడు ఐదు నెలలు ఎందుకు ఉండనివ్వరు? అసలు వీసా అంటే అమెరికాలో ఆరు నెలలు ఉండేందుకు ఇచ్చే పర్మిషన్ కాదు. వీసా ఉంటే అమెరికా వరకు వెళ్లి అక్కడ ఎంట్రీ కోరవచ్చు. దేశంలోకి అనుమతించాలా వద్దా, అనుమతిస్తే ఎంతకాలం ఉండొచ్చన్న చివరి నిర్ణయం ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారిదే.
ఈ దంపతులు మయామీ చేరుకున్న తర్వాత వారిని సెకండరీ ఇన్స్పెక్షన్కు పంపించారు. తండ్రికి భారత్లో ఉద్యోగం ఉండగా ఐదు నెలలు అమెరికాలో ఎందుకు ఉండాలని అధికారి ప్రశ్నించినట్లు వారి కుమారుడు సోషల్ మీడియాలో తెలిపాడు. కుటుంబంలో బిడ్డ పుట్టే సమయంలో అక్కడ ఉండేందుకు వచ్చామని చెప్పినా, అధికారులు రెండు నెలల స్టే మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చన్నది ఐ-94లో కనిపిస్తుంది. ఉదాహరణకు వీసా మరో ఐదేళ్లు వాలిడ్గా ఉన్నా, ఐ-94లో నవంబర్ 5 వరకు మాత్రమే అనుమతి ఉంటే ఆ తేదీలోపే దేశం నుంచి బయటకు రావాలి. ఈ కుటుంబం ఐదు నెలల తర్వాత రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నా, అది ఐదు నెలలు ఉండేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చినట్లు కాదు. ఇప్పుడు వాళ్లు ఆ టికెట్ను ముందుకు మార్చుకోవాల్సి ఉంటుంది.
అసలైతే విజిటర్ వీసాతో కొందరికి ఆరు నెలల వరకు స్టే ఇవ్వొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ అంతే సమయం ఇవ్వాలనే రూల్ లేదు. ప్రయాణం ఎందుకు, ఎంతకాలం ఉండబోతున్నారు, భారత్తో వారికి ఉన్న సంబంధాలు ఏంటి వంటి విషయాలు చూసి అధికారులు తక్కువ సమయం కూడా ఇవ్వొచ్చు. ఈ హైదరాబాద్ దంపతుల విషయంలో కూడా అమెరికాలో ఎంట్రీని ఆపలేదు.. ఐదు నెలల బదులు రెండు నెలల వరకే ఉండాలని నిర్ణయించారు.
This post was last modified on September 8, 2026 10:41 am
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే…
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్…
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…