ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,82,38,795 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న జనాభాను లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 66.05 శాతం పరీక్షలు నిర్వహించారు.
సర్వేలో భాగంగా ఆగస్టు వరకు రాష్ట్రంలో మొత్తం 59.29 లక్షల అధిక రక్తపోటు కేసులు గుర్తించారు. వీటిలో తాజా సర్వే ద్వారా 11.79 లక్షల కొత్త బీపీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా మొత్తం 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించగా, తాజా సర్వేలో 10.72 లక్షల కొత్త కేసులు గుర్తించారు. మిగిలిన కేసులు గతంలో నిర్వహించిన సర్వేల ద్వారా గుర్తించినవని అధికారులు తెలిపారు.
అధిక రక్తపోటు కేసుల శాతంలో బాపట్ల జిల్లా 19.65 శాతంతో మొదటి స్థానంలో ఉంది. కోనసీమ 19.45, పశ్చిమ గోదావరి 19.05, కృష్ణా 17.97, తూర్పు గోదావరి 17.77 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5.63, శ్రీ సత్యసాయి 8.47, అన్నమయ్య 9.93, చిత్తూరు 10.10, కర్నూలు 10.28 శాతం నమోదయ్యాయి.
మధుమేహం కేసుల శాతంలో బాపట్ల 16.89 శాతంతో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి 15.89, తూర్పు గోదావరి 15.23, ప్రకాశం 15.19, కృష్ణా 15.01 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1.51, పోలవరం 5.88, శ్రీ సత్యసాయి 6.56, కర్నూలు 6.86, పార్వతీపురం మన్యం 7.14 శాతం నమోదయ్యాయి. ఈ మేరకు ఒక నివేదికను ఈరోజు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేశారు
This post was last modified on September 1, 2026 10:45 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…