తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం.
మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్, క్లీనర్ పరారైనట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రెండు ప్రమాదాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on August 27, 2026 11:13 am
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…