Movie News

45 ఏళ్ల కరీనా… ఇంకా కొత్త కాంబోలే!

కరీనా కపూర్ హీరోయిన్‌గా వచ్చి 26 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ఆమె వయసు 45. ఇంత లాంగ్ కెరీర్ తర్వాత కూడా కొత్త హీరోలతో సినిమాలు రావడం మాత్రం ఆగలేదు. సెప్టెంబర్ 18న రిలీజ్ కానున్న ‘దాయిరా’లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో తొలిసారి నటిస్తోంది. ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లుగా కనిపించబోతున్నారు. 

కరీనా కెరీర్‌లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్లతో ఎప్పుడో సినిమాలు చేసింది. కొందరితో మళ్లీ మళ్లీ నటించింది కూడా. అయినా ఇప్పుడు పాత కాంబోల చుట్టూనే తిరగకుండా పృథ్వీరాజ్ లాంటి మరో ఇండస్ట్రీ స్టార్‌తో జోడీ కట్టడం కొత్తగా ఉంది. పైగా దాయిరా తర్వాత మరో కొత్త కాంబో కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. 

ధనుష్, కరీనా ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించే హిందీ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని దర్శకుడు పీఎస్ మిత్రన్ స్వయంగా చెప్పాడు. డేట్స్ చూసుకుంటున్నామని, ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇది కుదిరితే ధనుష్, కరీనా కలిసి నటించడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పృథ్వీరాజ్, ధనుష్ ఇద్దరూ సౌత్‌లో తమకంటూ పెద్ద కెరీర్ ఉన్న హీరోలు. 

ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌కు కొత్త కాంబో అంటే మరో హిందీ హీరో పేరు ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు 45 ఏళ్ల కరీనాకు మలయాళం నుంచి పృథ్వీరాజ్, తమిళం నుంచి ధనుష్ లాంటి పేర్లు రావడం చూస్తుంటే సినిమా మార్కెట్ ఎంత మారిందో చెప్పవచ్చు. కరీనా కూడా గత కొన్నేళ్లుగా ఒకే రకం సినిమాలకు పరిమితం కాలేదు.

జానే జాన్‌తో ఓటీటీకి వెళ్లింది. క్రూ లాంటి ముగ్గురు హీరోయిన్ల సినిమాను చేసింది. సింగమ్ అగైన్‌లో కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు మేఘనా గుల్జార్ దాయిరాతో మరో సీరియస్ పాత్ర చేస్తోంది. అంటే 26 ఏళ్ల తర్వాత కూడా తనకు తెలిసిన జోన్‌లోనే ఉండిపోవడం లేదు. ధనుష్ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది. అది కుదురుతుందో లేదో చూడాలి. కానీ పృథ్వీరాజ్‌తో దాయిరా ఇప్పటికే రెడీ అయింది.

This post was last modified on August 27, 2026 11:16 am

Share

Recent Posts

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

26 minutes ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

2 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

4 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

9 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

10 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

10 hours ago