గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఊహించని ఒక సంచలనం ఇరుముడి రేపుతోంది. ప్యాన్ ఇండియా బడ్జెట్ లేకుండా, బాలీవుడ్ నుంచి కోట్లు కుమ్మరించి హీరోయిన్ ని తీసుకురాకుండా, పక్కా తెలుగు నేటివిటీలో అది కూడా ఒక చిన్న ఊరిలో నడిపించిన కథకు ఆడియన్స్ ఈ స్థాయిలో బ్రహ్మరథం పడతారని నిర్మాతలు కూడా అనుకుని ఉండరేమో. అంచనాలకు మించి అద్భుతం చేస్తున్న ఇరుముడి గురించి చెప్పుకోవాల్సిన విశేషం, వీక్ డేస్ లోనూ ఏ మాత్రం తగ్గని ఆక్యుపెన్సీలతో దూసుకుపోవడం.
ప్రస్తుతం నూటా ఇరవై కోట్లు దాటేసిన ఇరుముడి ఫైనల్ థియేటర్ రన్ అయ్యేలోపు రెండు వందల కోట్లను అందుకోవాలనేది సగటు మూవీ లవర్స్ కోరిక. చూస్తుంటే అదేమీ అసాధ్యం అనిపించడం లేదు. ఎందుకంటే టాక్సిక్ తీర్పు దాదాపు వచ్చేసినట్టే. సోషల్ మీడియా స్పందన చూస్తుంటే టాక్ తాలూకు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో బుక్ మై షోలో కనిపిస్తోంది. యష్ ఇమేజ్ అనే రక్షణ కవచం లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా కిందకు వెళ్ళేది. సాలిడ్ ఓపెనింగ్స్ దక్కేవి కాదు.
ఇక ఇరుముడి విషయానికి వస్తే రాబోయే వీకెండ్ పూర్తిగా రవితేజ కంట్రోల్ లోనే ఉండనుంది. కొత్త రిలీజుల మీద బజ్ లేదు. వచ్చే వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి కానీ ఆడియన్స్ పూర్తిగా ఇరుముడిని వద్దనుకుని వాటికి వెళ్లేంత స్థాయిలో అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఒకవేళ ఇప్పుడీ వారాంతంలో నూటా అరవై కోట్లను కనక ఇరుముడి అందుకుంటే బ్యాలన్స్ నలభై ఇంకో రెండు వారాల్లో లాగేయొచ్చు. థియేటర్ రన్ ఎక్కువ దొరికేలా ఉంది.
రవితేజ కెరీర్ లోనే అత్యధిక నెంబర్లు నమోదు చేస్తున్న ఇరుముడికి ఇంకా పెద్ద వసూళ్లు వచ్చేవి కానీ నిన్న టాక్సిక్ కి ఎక్కువ స్క్రీన్లు కేటాయించడం, విశ్వనాథ్ అండ్ సన్స్ కు మూడో వారం అగ్రిమెంట్లు కొనసాగడం లాంటి కారణాల వల్ల షోల షేరింగ్ తప్పడం లేదు. చాలా బిసి సెంటర్లలో టికెట్లు దొరక్క, ఇరుముడి షోలు సరిపడినంత లేక గొడవలు, ధర్నాలు జరుగుతున్నాయి. మక్తల్ నుంచి ఉప్పల్ దాకా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే మటుకు డబుల్ సెంచరీ పక్కానే.
This post was last modified on August 27, 2026 11:24 am
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…