మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం లేవనెత్తిన సరికొత్త వివాదం పోటీదారులైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకు భలేగా కలిసొచ్చింది. వాట్సప్ యాజమాన్యం తన వాటాదారులకు సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. అదేమిటంటే వాట్సప్ యాప్ ను ఫేస్ బుక్ తో ఇంటర్ లింక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఫేస్ బుక్, వాట్సప్ యాప్ రెండు ఒకళ్ళవే. కాబట్టి వాట్సప్ ను ఫేసబుక్ తో ఇంటర్ లింక్ చేయటం ద్వారా ప్రైవసీ పాలసీలో మార్పలు తెచ్చింది.
అంటే ఫేస్ బుక్ లో ప్రస్తుతం ఉన్న వివరాల లాగే వాట్సప్ యాప్ కు కూడా వ్యక్తిగత వివరాలను యాజర్లు ఇవ్వాల్సుంటుంది. లేకపోత ఫేస్ బుక్ లో ఉన్న వివరాలనే తీసేసుకుంటుంది. అలాగే ఫేస్ బుక్ లో ఉన్న నిబంధనలన్నీ ఇకపై వాట్సప్ వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి ప్రైవసీ పాలసీని ప్రకటించటం వల్ల వాట్సప్ యూజర్లలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
ఇదే అదునుగా వాట్సప్ పీటీ యాప్ లైన సిగ్నల్, టెలిగ్రామ్ లపై జనాల కన్నుపడింది. నిజానికి ఈ రెండు యాప్ లు కూడా వాట్సప్ పనితీరులోనే ఉంటుంది. పైగా వాట్సప్ కన్నా ఇంకా బాగా పనిచేస్తాయి. ప్రైవసీ పాలసీ అని ఎప్పుడైతే వాట్సప్ యాజమాన్యం ఎప్పుడైతే నిబంధన తెచ్చిందో యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ ల దృష్టి సారించారు. జనవరి 5-12 తేదీల మధ్య యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ల నుండి 17.8 మిలియిన్ల యూజర్లు సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
అలాగే, సిగ్నల్ లాగే టెలిగ్రామ్ కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని కూడా యూజర్లు జనవరి 5-12 మంద్య 15.7 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదే సమయంలో జనవరి 5-12 మధ్య మిలియన్లలో వాట్సప్ యూజర్లు తగ్గిపోయారు. వాట్సప్ ను డౌన్ లోడ్ చేసుకునే వాళ్ళు తగ్గిపోవటమే కాకుండా తమ ఖాతాలను అన్ సబ్ స్క్రైబ్ చేసుకుంటున్న యూజర్లు కూడా మిలియిన్లలో ఉంటున్నారట. దాంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన వాట్సప్ యాజమాన్యం ఇపుడు లబోదిబో మంటోంది.
This post was last modified on January 15, 2021 1:07 pm
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…
నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…