మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం లేవనెత్తిన సరికొత్త వివాదం పోటీదారులైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకు భలేగా కలిసొచ్చింది. వాట్సప్ యాజమాన్యం తన వాటాదారులకు సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. అదేమిటంటే వాట్సప్ యాప్ ను ఫేస్ బుక్ తో ఇంటర్ లింక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఫేస్ బుక్, వాట్సప్ యాప్ రెండు ఒకళ్ళవే. కాబట్టి వాట్సప్ ను ఫేసబుక్ తో ఇంటర్ లింక్ చేయటం ద్వారా ప్రైవసీ పాలసీలో మార్పలు తెచ్చింది.
అంటే ఫేస్ బుక్ లో ప్రస్తుతం ఉన్న వివరాల లాగే వాట్సప్ యాప్ కు కూడా వ్యక్తిగత వివరాలను యాజర్లు ఇవ్వాల్సుంటుంది. లేకపోత ఫేస్ బుక్ లో ఉన్న వివరాలనే తీసేసుకుంటుంది. అలాగే ఫేస్ బుక్ లో ఉన్న నిబంధనలన్నీ ఇకపై వాట్సప్ వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి ప్రైవసీ పాలసీని ప్రకటించటం వల్ల వాట్సప్ యూజర్లలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
ఇదే అదునుగా వాట్సప్ పీటీ యాప్ లైన సిగ్నల్, టెలిగ్రామ్ లపై జనాల కన్నుపడింది. నిజానికి ఈ రెండు యాప్ లు కూడా వాట్సప్ పనితీరులోనే ఉంటుంది. పైగా వాట్సప్ కన్నా ఇంకా బాగా పనిచేస్తాయి. ప్రైవసీ పాలసీ అని ఎప్పుడైతే వాట్సప్ యాజమాన్యం ఎప్పుడైతే నిబంధన తెచ్చిందో యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ ల దృష్టి సారించారు. జనవరి 5-12 తేదీల మధ్య యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ల నుండి 17.8 మిలియిన్ల యూజర్లు సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
అలాగే, సిగ్నల్ లాగే టెలిగ్రామ్ కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని కూడా యూజర్లు జనవరి 5-12 మంద్య 15.7 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదే సమయంలో జనవరి 5-12 మధ్య మిలియన్లలో వాట్సప్ యూజర్లు తగ్గిపోయారు. వాట్సప్ ను డౌన్ లోడ్ చేసుకునే వాళ్ళు తగ్గిపోవటమే కాకుండా తమ ఖాతాలను అన్ సబ్ స్క్రైబ్ చేసుకుంటున్న యూజర్లు కూడా మిలియిన్లలో ఉంటున్నారట. దాంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన వాట్సప్ యాజమాన్యం ఇపుడు లబోదిబో మంటోంది.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…