Trends

వాట్సప్ వివాదం టెలిగ్రామ్, సిగ్నల్ కు భలేగా కలిసొచ్చిందే

మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం లేవనెత్తిన సరికొత్త వివాదం పోటీదారులైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకు భలేగా కలిసొచ్చింది. వాట్సప్ యాజమాన్యం తన వాటాదారులకు సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. అదేమిటంటే వాట్సప్ యాప్ ను ఫేస్ బుక్ తో ఇంటర్ లింక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఫేస్ బుక్, వాట్సప్ యాప్ రెండు ఒకళ్ళవే. కాబట్టి వాట్సప్ ను ఫేసబుక్ తో ఇంటర్ లింక్ చేయటం ద్వారా ప్రైవసీ పాలసీలో మార్పలు తెచ్చింది.

అంటే ఫేస్ బుక్ లో ప్రస్తుతం ఉన్న వివరాల లాగే వాట్సప్ యాప్ కు కూడా వ్యక్తిగత వివరాలను యాజర్లు ఇవ్వాల్సుంటుంది. లేకపోత ఫేస్ బుక్ లో ఉన్న వివరాలనే తీసేసుకుంటుంది. అలాగే ఫేస్ బుక్ లో ఉన్న నిబంధనలన్నీ ఇకపై వాట్సప్ వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి ప్రైవసీ పాలసీని ప్రకటించటం వల్ల వాట్సప్ యూజర్లలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

ఇదే అదునుగా వాట్సప్ పీటీ యాప్ లైన సిగ్నల్, టెలిగ్రామ్ లపై జనాల కన్నుపడింది. నిజానికి ఈ రెండు యాప్ లు కూడా వాట్సప్ పనితీరులోనే ఉంటుంది. పైగా వాట్సప్ కన్నా ఇంకా బాగా పనిచేస్తాయి. ప్రైవసీ పాలసీ అని ఎప్పుడైతే వాట్సప్ యాజమాన్యం ఎప్పుడైతే నిబంధన తెచ్చిందో యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ ల దృష్టి సారించారు. జనవరి 5-12 తేదీల మధ్య యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ల నుండి 17.8 మిలియిన్ల యూజర్లు సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

అలాగే, సిగ్నల్ లాగే టెలిగ్రామ్ కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని కూడా యూజర్లు జనవరి 5-12 మంద్య 15.7 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదే సమయంలో జనవరి 5-12 మధ్య మిలియన్లలో వాట్సప్ యూజర్లు తగ్గిపోయారు. వాట్సప్ ను డౌన్ లోడ్ చేసుకునే వాళ్ళు తగ్గిపోవటమే కాకుండా తమ ఖాతాలను అన్ సబ్ స్క్రైబ్ చేసుకుంటున్న యూజర్లు కూడా మిలియిన్లలో ఉంటున్నారట. దాంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన వాట్సప్ యాజమాన్యం ఇపుడు లబోదిబో మంటోంది.

This post was last modified on January 15, 2021 1:07 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

26 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

39 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

50 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago