బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా ఇమేజ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. ఈ మధ్యే ‘భారత భాగ్య విదాత’ అని ఓ మంచి సినిమా చేస్తే పట్టుమని పది కోట్ల వసూళ్లు కూడా రాలేదు. గత కొన్నేళ్లలో కంగనా నటించిన సినిమాలన్నింటి పరిస్థితీ ఇదే. ఐతే చాన్నాళ్ల తర్వాత ఆమె నుంచి ఒక ప్రామిసింగ్ మూవీ రాబోతోంది. అదే.. క్వీన్-2.
కంగనా కెరీర్ను మలుపు తిప్పి, ఆమెను పెద్ద స్టార్ను చేసిన ‘క్వీన్’ మూవీకి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజే ఉంది. ‘క్వీన్’ తీసిన వికాస్ బల్యే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. జియో స్టూడియోస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘క్వీన్-2’కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.
ఈ చిత్ర నిర్మాతల మీద రూ.250 కోట్లకు దావా వేసింది ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ. ‘క్వీన్’ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఆ ప్రొడక్షన్ హౌసే. సీక్వెల్ కథకు సంబంధించి క్రియేటివ్ రైట్స్ తమ దగ్గరే ఉన్నాయని, తమ అనుమతి లేకుండా సినిమా తీసినందుకు తమకు రూ.250 కోట్లు కట్టాలని జియో స్టూడియోస్కు నోటీస్ పంపించింది ఫాంటమ్ సంస్థ. ఈ సినిమా ప్రొడక్షన్ రైట్స్ విషయంలో ఫాంటమ్, జియో స్టూడియోస్ మధ్య కొన్ని నెలల ముందు నుంచే చర్చలు జరుగుతున్నా.. అవి ఒక కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు ఫాంటమ్ సంస్థ కోర్టుకు ఎక్కింది.
ఐతే ‘క్వీన్-2’కు క్రేజ్ ఉన్నప్పటికీ, కంగనా మార్కెట్ ఇప్పుడు బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ‘క్వీన్’ తరహాలో ‘క్వీన్-2’ వంద కోట్ల వసూళ్లు అయినా కలెక్ట్ చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏకంగా రూ.250 కోట్ల నష్ట పరిహారం కోరుతూ ఫాంటమ్ సంస్థ కోర్టుకెక్కడం మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఈ వివాదాన్ని జియో స్టూడియోస్ ఎలా పరిష్కరించుకుని ‘క్వీన్-2’ను సజావుగా రిలీజ్ చేస్తుందో చూడాలి.
This post was last modified on July 7, 2026 6:59 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…