Movie News

కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా ఇమేజ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. ఈ మధ్యే ‘భారత భాగ్య విదాత’ అని ఓ మంచి సినిమా చేస్తే పట్టుమని పది కోట్ల వసూళ్లు కూడా రాలేదు. గత కొన్నేళ్లలో కంగనా నటించిన సినిమాలన్నింటి పరిస్థితీ ఇదే. ఐతే చాన్నాళ్ల తర్వాత ఆమె నుంచి ఒక ప్రామిసింగ్ మూవీ రాబోతోంది. అదే.. క్వీన్-2. 

కంగనా కెరీర్‌ను మలుపు తిప్పి, ఆమెను పెద్ద స్టార్‌ను చేసిన ‘క్వీన్’ మూవీకి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజే ఉంది. ‘క్వీన్’ తీసిన వికాస్ బల్‌యే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. జియో స్టూడియోస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘క్వీన్-2’కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.

ఈ చిత్ర నిర్మాతల మీద రూ.250 కోట్లకు దావా వేసింది ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ. ‘క్వీన్’ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఆ ప్రొడక్షన్ హౌసే. సీక్వెల్ కథకు సంబంధించి క్రియేటివ్ రైట్స్ తమ దగ్గరే ఉన్నాయని, తమ అనుమతి లేకుండా సినిమా తీసినందుకు తమకు రూ.250 కోట్లు కట్టాలని జియో స్టూడియోస్‌కు నోటీస్ పంపించింది ఫాంటమ్ సంస్థ. ఈ సినిమా ప్రొడక్షన్ రైట్స్ విషయంలో ఫాంటమ్, జియో స్టూడియోస్ మధ్య కొన్ని నెలల ముందు నుంచే చర్చలు జరుగుతున్నా.. అవి ఒక కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు ఫాంటమ్ సంస్థ కోర్టుకు ఎక్కింది. 

ఐతే ‘క్వీన్-2’కు క్రేజ్ ఉన్నప్పటికీ, కంగనా మార్కెట్ ఇప్పుడు బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ‘క్వీన్’ తరహాలో ‘క్వీన్-2’ వంద కోట్ల వసూళ్లు అయినా కలెక్ట్ చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏకంగా రూ.250 కోట్ల నష్ట పరిహారం కోరుతూ ఫాంటమ్ సంస్థ కోర్టుకెక్కడం మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఈ వివాదాన్ని జియో స్టూడియోస్ ఎలా పరిష్కరించుకుని ‘క్వీన్-2’ను సజావుగా రిలీజ్ చేస్తుందో చూడాలి.

This post was last modified on July 7, 2026 6:59 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

40 minutes ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

1 hour ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

1 hour ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

2 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

5 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

5 hours ago