వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం కురిసింది. గంటల తరబడి నగరంలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వర్షం కురిసిన ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయేదాకా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జాంలు కొనసాగాయి.
మంగళవారం సాయంత్రం సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా వర్షం కురిసిన నేపథ్యంలో సరాసరి 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పాతబస్తీ, రాయదుర్గం ఉన్న నగర పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా రాయదుర్గం, మాదాపూర్ లలో కిలోమీటర్ల కొలది ట్రాఫిక్ స్తంబించిపోయింది.
ఇదిలా ఉంటే… పాతబస్తీలో కురిసిన వర్షం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. భారీ వర్షం నేపథ్యంలో పాతబస్తీలోని ఓ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగి కింద పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకపోవడంతో నీళ్లలోకి విద్యుత్ ప్రసారం అయ్యింది.
అదే సమయంలో ఆటో నుంచి దిగిపోయిన ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇక పాతబస్తీలోనే భారీ వర్షం కారణంగా ఓ భారీ కమాన్ కూలిపోయింది. మొత్తంగా తొలకరి చినుకులే హైదరాబాద్ ను వణించాయని చెప్పాలి.
This post was last modified on June 10, 2026 12:18 pm
అల్లు అర్జున్కు ఆల్రెడీ హైదరాబాద్లో రెండు మల్టీప్లెక్సులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకటేమో ఏషియన్ వాళ్ల భాగస్వామ్యంతో అమీర్ పేటలో…
ఏడాది వెనక్కి వెళ్తే మెగా ఫ్యామిలీ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. అల్లు అర్జున్ను పక్కన పెట్టేస్తే.. మెగాస్టార్…
విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఆయన కథను ఓకే చేసి మీడియాలో ప్రాజెక్టు గురించి వార్త కూడా వచ్చాక ఆగిపోయిన సినిమాలు…
బాలినేని శ్రీనివాసరెడ్డి... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరింత…
వైజాగ్ లో అల్లు ఫ్యామిలీ, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 8 స్క్రీన్ల ఏఏఏ మల్టీప్లెక్స్ అఫీషియల్ గా లాంచయ్యింది.…
ఏపీలోని రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…