Trends

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు ఏకంగా 21 మందిని బలితీసుకున్నాయి. ఈ ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో ఉన్న రెస్టారెంట్‌లో అగ్ని కీలలు మొదలై, పక్కనే ఉన్న మరో హోటల్ మికాసా ఇన్‌కు కూడా వ్యాపించాయి. మృతుల్లో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం నగరానికి వచ్చిన విదేశీయులే ఉన్నారు. ప్రమాద సమయంలో చాలా మంది నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగింది.

ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు అద్దాలు పగలగొట్టుకుని భవనం పైనుంచి కిందకు దూకేశారు. వారిని కాపాడేందుకు స్థానికులు కింద పరుపులు వేసినా, పైనుంచి పడటంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణభయంతో హాహాకారాలు చేస్తున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి దాదాపు 40 మందికి పైగా సురక్షితంగా కాపాడారు. మికాసా ఇన్‌లో పనిచేసే ఒక చెఫ్ ఉదయం ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే మంటలు చెలరేగాయని చెప్పడం గమనార్హం.

ఈ ఘోర ప్రమాదానికి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణమని ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్లోరిష్ స్టే హోటల్‌కు ప్రభుత్వం కేవలం ఆరు గదుల సామర్థ్యంతో నడిపేందుకు బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ లైసెన్స్ మాత్రమే ఇచ్చింది. కానీ యాజమాన్యం లాభాల కక్కుర్తితో బేస్‌మెంట్‌ను కూడా కలుపుకుని ఏకంగా 25 గదులతో హోటల్ నడిపినట్లు తెలుస్తోంది. ఇంత రద్దీ ఉన్న హోటల్‌కు కేవలం ఒకే ఒక ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఉండటం వల్లే ప్రాణనష్టం పెరిగింది.

ఈ హోటల్‌కు అసలు ఫైర్ ఎన్ఓసీ ఉందా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరుకైన గల్లీలో జనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి వ్యాపారాలు ఎలా కొనసాగాయనేది ఇప్పుడు అసలు ప్రశ్న. విదేశాల నుంచి వచ్చే పేషెంట్లు ఆశ్రయం పొందే ప్రాంతాల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం. ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు లోపించడమే ఈ మరణాలకు కారణం అని విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘోర విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించగా, గాయపడిన వారికి 50 వేలు ఇస్తామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఢిల్లీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Kumar

Recent Posts

వారణాసికి ఐమాక్స్ తెరల సమస్య

ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…

59 minutes ago

ఇస్రో కు షాకిస్తున్న రాజీనామాలు… కట్టడికి కొత్త రూల్స్!

భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…

1 hour ago

వరల్డ్ కప్‌లో ఇండియా vs పాక్… మూడుసార్లు?

క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…

2 hours ago

అమెరికాకు అక్రమ ప్రయాణాలు బంద్… భారీగా తగ్గిన ఇండియన్స్!

మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…

3 hours ago

అయ్యగారిని కన్నీళ్లతో తడిపేసిన అభిమాని

తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…

4 hours ago

అబ్బవరం స్టోరీకి శకునాలు బాగున్నాయి

వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…

11 hours ago