Trends

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఎంతగా సాంకేతికంగా అభివృద్ది చెందినా ప్రకృతి ప్రకోపించిందంటే మాత్రం మనిషి మసి కాక తప్పదు. ఇది అక్షర సత్యం అంటూ ఇప్పటికే ఎన్నో పరిణామాలు తేల్చి చెప్పాయి. తాజాగా అలాంటి మరో ఉదాహరణ కనిపించింది. రాజస్థాన్ లోని బికనీర్ పట్టపగలే చీకటిమయంలోకి కూరుకుపోయింది. దీనికి కారణం అక్కడ నెలకొన్న భారీ ఇసుక తుఫానే.

రాజస్థాన్ అంటేనే ఏడారులు గుర్తుకు వస్తాయి. ఎడారి రాష్ట్రంగా పేరు పడిపోయిన రాజస్థాన్ లో బికనీర్ సహా చాలా పట్టణాలు, నగరాలు ఏడారులకు ఆనుకునే ఉంటాయి. బికనీర్ కూడా ఎడారి ప్రాంతమే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఇసుక తుఫాను వచ్చేసింది. నగరాన్ని కమ్మేస్తున్నట్లుగా.. నగరంపై విరుచుకుపడుతున్నట్లుగా వచ్చిన ఆ తుఫానుతో బికనీర్ వణికిపోయిందనే చెప్పాలి. ఇసుక తుఫాను కారణంగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా… సూర్యుడు అప్పుడే మాయమయ్యాడా? అన్నట్లుగా నగరం మొత్తం చీకట్లోకి వెళ్లిపోయింది.

ఇసుక తుఫాను వస్తున్న సందర్భంగా ఓ వ్యక్తి దానిని వీడియో తీశాడు. సెల్ ఫోన్ ద్వారానే ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. నెట్టింట వైరల్ గా మారిపోయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు జలదరించక మానదు. నగరంలోని ఇళ్ల మీదుగా… ఇంకా చెప్పాలంటే యావత్తు నగరం మీదుగా ఇసుక అలా వచ్చి పడుతుంటే…దానిని నిలువరించడం అసలు సాధ్యం అయ్యే పనే కాదని చెప్పాలి. ఈ వీడియో చూసిన వారంతా మన నగరాలు, పట్టణాలు, గ్రామాల మీదకు ఇసుక తుఫాను వస్తే మన కథ అయిపోయినట్టేనన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Kumar

Recent Posts

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

40 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

7 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

8 hours ago