రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ ఇచ్చిన నేపాలీలు తదనంతరం ఇళ్లల్లో పని మనుషులుగా మారిపోయారు. ఆపై పనిమనుషులుగా ఉంటూనే ఆయా ఇళ్లల్లోని విలువైన వస్తువులను గుర్తించి వాటిని చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారిని నేపాలీలు చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వెరసి తెలుగు రాష్ట్రాల్లో నేపాలీలంటేనే భయం వ్యక్తమవుతోంది.
మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అదికారి వినయ్ రంజన్ రే సతీమణిని హత్య చేసిన నేపాలీ ముఠా… ఇంటిలోని విలువైన వస్తువుతో ఉడాయించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఓ రిటైర్డ్ ఐపీఎస్ బార్య కావడంతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో ఉన్నారు.
ఈ ఘటన మరువకముందే… హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు తీయొద్దని బాదితులు వేడుకోవడంతో వారి ఇంటిలోని విలువైన వస్తువులను తీసుకుని.. బాధితులకు మత్తు మందు ఇచ్చిన నేపాలీ ముఠా పరారైంది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే…కౌకూరు గోల్ప్ ఎన్ క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68) తన భార్య విజయ లక్ష్మీ (58)తో కలిసి ఉంటున్నారు. కొంతకాలం క్రితం నేపాల్ కు చెందిన ఓ జంట వీరి ఇంటిలో పనికి కుదిరారు. కొన్ని రోజుల తర్వాత వారి బంధువునని చెప్పిన మరో మహిళ ఆ ఇంటిలోకి చేరింది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తర్వాత వచ్చిన మహిళ జన్మదినముందని, వేడుకలు జరుపుకుంటామని చెప్పి వృద్ద దంపతుల వద్ద అనుమతి తీసుకున్నారు. బర్త్ డే వేడుకల పేరిట సోమవారం రాత్రి మరో ముగ్గురు వారి బంధువులమంటూ ఆ ఇంటికి వచ్చారు.
ఈ సందర్భంగా బర్త్ డే కోసం కేక్ ను వృద్ద దంపతుల ద్వారానే కొనుగోలు చేసిన నేపాలీ ముథా.. కేక్ ను కట్ చేస్తున్నట్లు నటించి… వృద్ధ దంపతుల వెనక్కెళ్లి వారి చేతులను కట్టి వేసి తమ ప్రతాపం చూపబోయారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన వృద్ధ దంపతులు తమను ఏమీ చేయవద్దని, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి అని చెప్పడంతో వారిని వదిలేసిన నేపాలీ ముఠా ఇంటిలోని బంగారం, డబ్బును తీసుకుంది.
ఆ తర్వాత వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి… ఇంటికి అన్ని గేట్లకు తాళాలు వేసి ఆటోలో పరారైంది. మత్తు దిగిన తర్వాత జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకున్న మురళీధర్… కిటికీలో నుంచి అటుగా వెళుతున్నవారిని కేక వేసి పిలిచి తలుపులు తెరిపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
This post was last modified on May 13, 2026 1:18 pm
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…