Trends

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ ఇచ్చిన నేపాలీలు తదనంతరం ఇళ్లల్లో పని మనుషులుగా మారిపోయారు. ఆపై పనిమనుషులుగా ఉంటూనే ఆయా ఇళ్లల్లోని విలువైన వస్తువులను గుర్తించి వాటిని చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారిని నేపాలీలు చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వెరసి తెలుగు రాష్ట్రాల్లో నేపాలీలంటేనే భయం వ్యక్తమవుతోంది.

మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అదికారి వినయ్ రంజన్ రే సతీమణిని హత్య చేసిన నేపాలీ ముఠా… ఇంటిలోని విలువైన వస్తువుతో ఉడాయించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఓ రిటైర్డ్ ఐపీఎస్ బార్య కావడంతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో ఉన్నారు.

ఈ ఘటన మరువకముందే… హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు తీయొద్దని బాదితులు వేడుకోవడంతో వారి ఇంటిలోని విలువైన వస్తువులను తీసుకుని.. బాధితులకు మత్తు మందు ఇచ్చిన నేపాలీ ముఠా పరారైంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే…కౌకూరు గోల్ప్ ఎన్ క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68) తన భార్య విజయ లక్ష్మీ (58)తో కలిసి ఉంటున్నారు. కొంతకాలం క్రితం నేపాల్ కు చెందిన ఓ జంట వీరి ఇంటిలో పనికి కుదిరారు. కొన్ని రోజుల తర్వాత వారి బంధువునని చెప్పిన మరో మహిళ ఆ ఇంటిలోకి చేరింది.

ఈ క్రమంలో సోమవారం రాత్రి తర్వాత వచ్చిన మహిళ జన్మదినముందని, వేడుకలు జరుపుకుంటామని చెప్పి వృద్ద దంపతుల వద్ద అనుమతి తీసుకున్నారు. బర్త్ డే వేడుకల పేరిట సోమవారం రాత్రి మరో ముగ్గురు వారి బంధువులమంటూ ఆ ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా బర్త్ డే కోసం కేక్ ను వృద్ద దంపతుల ద్వారానే కొనుగోలు చేసిన నేపాలీ ముథా.. కేక్ ను కట్ చేస్తున్నట్లు నటించి… వృద్ధ దంపతుల వెనక్కెళ్లి వారి చేతులను కట్టి వేసి తమ ప్రతాపం చూపబోయారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన వృద్ధ దంపతులు తమను ఏమీ చేయవద్దని, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి అని చెప్పడంతో వారిని వదిలేసిన నేపాలీ ముఠా ఇంటిలోని బంగారం, డబ్బును తీసుకుంది.

ఆ తర్వాత వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి… ఇంటికి అన్ని గేట్లకు తాళాలు వేసి ఆటోలో పరారైంది. మత్తు దిగిన తర్వాత జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకున్న మురళీధర్… కిటికీలో నుంచి అటుగా వెళుతున్నవారిని కేక వేసి పిలిచి తలుపులు తెరిపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Kumar

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

31 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

12 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago