Trends

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ ఇచ్చిన నేపాలీలు తదనంతరం ఇళ్లల్లో పని మనుషులుగా మారిపోయారు. ఆపై పనిమనుషులుగా ఉంటూనే ఆయా ఇళ్లల్లోని విలువైన వస్తువులను గుర్తించి వాటిని చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారిని నేపాలీలు చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వెరసి తెలుగు రాష్ట్రాల్లో నేపాలీలంటేనే భయం వ్యక్తమవుతోంది.

మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అదికారి వినయ్ రంజన్ రే సతీమణిని హత్య చేసిన నేపాలీ ముఠా… ఇంటిలోని విలువైన వస్తువుతో ఉడాయించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఓ రిటైర్డ్ ఐపీఎస్ బార్య కావడంతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో ఉన్నారు.

ఈ ఘటన మరువకముందే… హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు తీయొద్దని బాదితులు వేడుకోవడంతో వారి ఇంటిలోని విలువైన వస్తువులను తీసుకుని.. బాధితులకు మత్తు మందు ఇచ్చిన నేపాలీ ముఠా పరారైంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే…కౌకూరు గోల్ప్ ఎన్ క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68) తన భార్య విజయ లక్ష్మీ (58)తో కలిసి ఉంటున్నారు. కొంతకాలం క్రితం నేపాల్ కు చెందిన ఓ జంట వీరి ఇంటిలో పనికి కుదిరారు. కొన్ని రోజుల తర్వాత వారి బంధువునని చెప్పిన మరో మహిళ ఆ ఇంటిలోకి చేరింది.

ఈ క్రమంలో సోమవారం రాత్రి తర్వాత వచ్చిన మహిళ జన్మదినముందని, వేడుకలు జరుపుకుంటామని చెప్పి వృద్ద దంపతుల వద్ద అనుమతి తీసుకున్నారు. బర్త్ డే వేడుకల పేరిట సోమవారం రాత్రి మరో ముగ్గురు వారి బంధువులమంటూ ఆ ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా బర్త్ డే కోసం కేక్ ను వృద్ద దంపతుల ద్వారానే కొనుగోలు చేసిన నేపాలీ ముథా.. కేక్ ను కట్ చేస్తున్నట్లు నటించి… వృద్ధ దంపతుల వెనక్కెళ్లి వారి చేతులను కట్టి వేసి తమ ప్రతాపం చూపబోయారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన వృద్ధ దంపతులు తమను ఏమీ చేయవద్దని, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి అని చెప్పడంతో వారిని వదిలేసిన నేపాలీ ముఠా ఇంటిలోని బంగారం, డబ్బును తీసుకుంది.

ఆ తర్వాత వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి… ఇంటికి అన్ని గేట్లకు తాళాలు వేసి ఆటోలో పరారైంది. మత్తు దిగిన తర్వాత జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకున్న మురళీధర్… కిటికీలో నుంచి అటుగా వెళుతున్నవారిని కేక వేసి పిలిచి తలుపులు తెరిపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

This post was last modified on May 13, 2026 1:18 pm

Share

Recent Posts

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

10 minutes ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

14 minutes ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

34 minutes ago

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

56 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

3 hours ago