తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. తిరుపతి పరిధిలోని జీవకోన సమీప మొండోడికోన వద్ద ఆదివారం సాయంత్రం చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలోని అడవిని దహనం చేశాయి.
మంటలు ఎగిసిపడుతుండటంతో సమీప ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. కాకులమాను అటవీ ప్రాంతం వైపు మంటలు విస్తరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం రాత్రి 9 గంటల వరకు తీవ్రంగా కొనసాగింది. మొండోడికోనలో ప్రారంభమైన మంటలు తిమ్మినాయుడుపాలెం సమీపంలోని ఎర్రచందనం గిడ్డంగుల పరిసర ప్రాంతాల దాకా వ్యాపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పచ్చని చెట్లు కాలిపోవడంతో అటవీ సంపదకు గణనీయ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎండల తీవ్రతతో మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆకతాయిల చర్యల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న కపిలతీర్థం అటవీశాఖ కార్యాలయం పరిధిలోనే ఘటన జరగడం గమనార్హం. అధికారులు అప్రమత్తంగా ఉండి మిగిలిన ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
This post was last modified on April 27, 2026 9:16 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…