Trends

మోడీ నోట విశాఖ కుర్రాడి మాట.. ఎవరీ వెంకట మురళీ ప్రసాద్?

ప్రధాని మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్. తన మనసులోని మాటల్ని చెప్పేందుకు మోడీ ఎంచుకున్న ఈ కార్యక్రమంలో.. ఆయన తన వరకు వచ్చిన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ లో.. విశాఖ పట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ అనే విశాఖ యువకుడి ప్రస్తావనను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆయన ఆలోచనను మోడీ ప్రశంసించారు. అంతేకాదు.. దేశ ప్రజలతో ఆయన ఆలోచనల్నివివరంగా వెల్లడించారు.

ఇంతకీ వెంకట మురళీ ప్రసాద్ ఎవరు? ఈ విశాఖ యువకుడు ఏం చేస్తుంటారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. విశాఖపట్నంలోని గాజువాక లో నివసిస్తుంటారు. అక్కడి ఆటోనగర్ లో అతని నివాసం. ఇంతకూ ఆ యువకుడు చేసిందేమంటే.. ప్రధానికి ‘ఏబీసీ 2021’ అంటూ తన ప్రతిపాదనను పంపారు.

ఇదే విషయాన్ని మోడీ ప్రస్తావిస్తూ.. తనకు వచ్చిన ఏబీసీ 2021 చార్ట్ అన్నంతనే అర్థం కాలేదని.. దాన్ని పరిశీలించి చూడగా.. ‘ఆత్మ నిర్భర్ భారత్ చార్ట్’ అని అర్థమైంది. ఆయన తన ఇంట్లో రోజువారీగా వాడే వస్తువుల జాబితాను రూపొందించారు. వాటిల్లో భారత్ లో తయారైన వాటినే ఎక్కువగా ఉపయోగించాలని తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఏటా మీరంతా కొత్త ఏడాది కోసం ఏదో ఒక తీర్మానం చేసుకుంటూనే ఉంటారు. ఈసారి మాత్రం దేశం కోసం చేయండి. దేశీయ వస్తువుల్నే వినియోగిస్తామని తీర్మానించుకోండి. వినియోగదారులు కూడా మేడిన్ ఇండియా వస్తువులనే డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆలోచన ధోరణిలో వచ్చిన భారీ మార్పు’’ అన్న మోడీ.. వెంటక మురళీ ప్రసాద్ చొరవను ప్రశంసించారు.

ఇంతకీ విశాఖ యువకుడు రూపొందించిన ఏబీసీ ఛార్ట్ 2021లో ఏమున్నదన్నది చూస్తే..మొత్తం ఆరు కేటగిరిలలో వస్తువుల పేర్లను పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు.. సెల్ఫ్ కేర్.. బట్టలు.. ఆఫీస్ అండ్ వర్క్.. కిచెన్ తో సహా ఇతర వస్తువుల పేర్లను ప్రస్తావించారు. రోజువారీ అవసరాలకు.. ఏయే బ్రాండ్లను వాడుకోవచ్చన్న ఆప్షన్ ఇచ్చారు. ఇవన్నీ స్వదేశీ వస్తువుల బ్రాండ్లే కావటం గమనార్హం. ఏసీ మొదలుకొని.. టూత్ బ్రష్ వరకు అన్ని దేశంలో తయారైనవని.. స్వదేశీ బ్రాండ్లనే ప్రస్తావించారు. ఈ ఆలోచనే.. ప్రధాని నోటి వెంట వెంకట మురళీ ప్రసాద్ మాట పలికేలా చేసింది.

This post was last modified on December 28, 2020 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago