తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మృతికి కారణమైన 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనను అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు, కస్టోడియల్ హింసపై కఠిన సందేశం ఇచ్చింది. అదేవిధంగా మృతుల కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
జూన్ 19, 2020న కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మొబైల్ యాక్సెసరీస్ దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో జయరాజ్, బెనిక్స్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాతాంకుళం పోలీస్ స్టేషన్లో వారిపై తీవ్రంగా హింసించినట్లు దర్యాప్తులో తేలింది. నిరంతరంగా కొట్టడంతో తీవ్ర గాయాలు, బలమైన దెబ్బల వల్ల ఏర్పడిన అంతర్గత గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా వారు మృతి చెందినట్లు వెల్లడైంది.
ఈ కేసులో ఇన్స్పెక్టర్, ఎస్సై, కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది పోలీసులు దోషులుగా తేలగా, కోర్టు వారికి మరణశిక్ష విధించింది. 2020లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించి, పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. తాజా తీర్పు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…