తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మృతికి కారణమైన 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనను అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు, కస్టోడియల్ హింసపై కఠిన సందేశం ఇచ్చింది. అదేవిధంగా మృతుల కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
జూన్ 19, 2020న కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మొబైల్ యాక్సెసరీస్ దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో జయరాజ్, బెనిక్స్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాతాంకుళం పోలీస్ స్టేషన్లో వారిపై తీవ్రంగా హింసించినట్లు దర్యాప్తులో తేలింది. నిరంతరంగా కొట్టడంతో తీవ్ర గాయాలు, బలమైన దెబ్బల వల్ల ఏర్పడిన అంతర్గత గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా వారు మృతి చెందినట్లు వెల్లడైంది.
ఈ కేసులో ఇన్స్పెక్టర్, ఎస్సై, కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది పోలీసులు దోషులుగా తేలగా, కోర్టు వారికి మరణశిక్ష విధించింది. 2020లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించి, పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. తాజా తీర్పు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…