ఏపీలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం యావత్తు దేశాన్ని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి ట్రావెల్స్ యాజమాన్యం, రాంగ్ రూట్ ప్రయాణాలే కారణమని చెప్పాలి. ఈ ప్రమాదం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. చనిపోయిన వారితో పాటు క్షతగాత్రుల్లో మెజారిటి మంది మార్కాపురానికి చెందిన వారే. కొందరు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఈ బస్సు బయలుదేరింది.
13 మందిని సజవంగా దహించివేసిన ఈ ప్రమాదానికి గల కారణాలేమిటన్న వివరాల్లోకి వెళితే… హరిక్రిష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు అసలు కండీషన్ లోనే లేదట. దూర ప్రయాణాలు చేసేందుకు వీలు లేని ఈ బస్సును ఏడాదికి పైగా ట్రాలెవ్స్ యాజమాన్యం తిప్పుతూనే ఉందట. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో 45 మంది ప్రయాణికులతో ఈ బస్సు ఏపీకి ప్రయాణమైంది.
బస్సు కండీషన్ లో లేని కారణంగా ఏడాది క్రితమే రవాణా శాఖ అధికారులు దానికి ఫైన్ కూడా వేశారట. ఇక డొక్కు బస్సుతో రోడ్డెక్కిన డ్రైవర్లు… మితి మీరిన వేగంతో నడపడమే కాకుండా రాంగ్ రూటులోనూ కదం తొక్కించారట. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద రాంగ్ రూట్ లోకి వచ్చేసిన బస్సు… ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. బస్సు కండీషన్ లో లేకపోవడం, రాంగ్ రూట్ లో ప్రయాణించడమే ప్రమాదానికి కారణాలుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… తెల్లవారుజామున ఎర్రగొండపాలెం వద్ద బస్సు మితి మీరిన వేగంతో కదులుతున్న సమయంలో బస్సు కండీషన్ సరిగా లేదంటూ ప్రయాణికులు డ్రైవర్ ను అప్రమత్తం చేశారట. దీంతో అతడు బస్సును ఆపి దాదాపుగా గంట పాటు బస్సుకు రిపేర్ చేసి ఆ తర్వాత తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడట.
అయితే ఎంత రిపేర్ చేసినా… బస్సు స్టీరింగ్ కండీషన్ లోకి రాలేదట. స్టీరింగ్ సరిగా లేని కారణంగానే ప్రమాదానికి ముందు బస్సు రాంగ్ రూట్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఏదేమైనా 13 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రమాదం బస్సు కండీషన్, ట్రావెట్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని చెప్పొచ్చు.
This post was last modified on March 26, 2026 7:19 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…