Trends

“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము

న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా
విచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం “పాలీ క్రైసిస్” వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశ యువతపై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకం, ప్రజాస్వామ్యం, జనాభా శక్తి, వైవిధ్యం వంటి అంశాలు భారత బలాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం భారత్ సుమారు 7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, యువతకు అందుతున్న అవకాశాలు దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పారు.

భారత మానవ వనరుల శక్తికి ఆధారమైన కీలక అంశాలను కూడా ఆయన వివరించారు:
1.యువ జనాభా
2.ఆంగ్ల భాషపై పట్టు
3.STEM రంగాల్లో ప్రతిభ
4.డిజిటల్ సామర్థ్యం & డేటా వినియోగం
5.అంతర్జాతీయ అంశాలపై బలమైన అవగాహన
6.సాంకేతికతను త్వరగా అలవాటు చేసుకునే నైపుణ్యం 7.సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం

ఈ అన్ని అంశాలు కలిసి భారత్‌ను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా నిలబెడుతున్నాయని జూపల్లి రాము రావు స్పష్టం చేశారు.

దేశంలో అగ్రగామి న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నిర్వహించిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన కీలక ప్రసంగంలో భారత్‌ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారు.

గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ దృష్టిలో భారత్ స్థానం మారిందని, టెక్నాలజీ వినియోగదారుడి నుంచి ఉత్పత్తిదారుగా ఎదిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియా సంక్షోభంపై TV9 నెట్‌వర్క్ కవరేజ్‌ను అభినందించారు. అలాగే, పాలసీ, వ్యాపారం, టెక్నాలజీ రంగాల ప్రముఖులతో భారత్ గ్లోబల్ ప్రయాణం, ఎదుగుదలపై ఈ సమ్మిట్ చర్చలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.

This post was last modified on March 24, 2026 5:39 pm

Share

Recent Posts

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

29 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

49 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

2 hours ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

4 hours ago