న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్కు ముఖ్య అతిథిగా
విచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం “పాలీ క్రైసిస్” వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశ యువతపై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకం, ప్రజాస్వామ్యం, జనాభా శక్తి, వైవిధ్యం వంటి అంశాలు భారత బలాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్ సుమారు 7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, యువతకు అందుతున్న అవకాశాలు దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పారు.
భారత మానవ వనరుల శక్తికి ఆధారమైన కీలక అంశాలను కూడా ఆయన వివరించారు:
1.యువ జనాభా
2.ఆంగ్ల భాషపై పట్టు
3.STEM రంగాల్లో ప్రతిభ
4.డిజిటల్ సామర్థ్యం & డేటా వినియోగం
5.అంతర్జాతీయ అంశాలపై బలమైన అవగాహన
6.సాంకేతికతను త్వరగా అలవాటు చేసుకునే నైపుణ్యం 7.సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం
ఈ అన్ని అంశాలు కలిసి భారత్ను గ్లోబల్ టాలెంట్ హబ్గా నిలబెడుతున్నాయని జూపల్లి రాము రావు స్పష్టం చేశారు.
దేశంలో అగ్రగామి న్యూస్ నెట్వర్క్ అయిన TV9 నిర్వహించిన ఈ గ్లోబల్ సమ్మిట్లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన కీలక ప్రసంగంలో భారత్ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారు.
గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ దృష్టిలో భారత్ స్థానం మారిందని, టెక్నాలజీ వినియోగదారుడి నుంచి ఉత్పత్తిదారుగా ఎదిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియా సంక్షోభంపై TV9 నెట్వర్క్ కవరేజ్ను అభినందించారు. అలాగే, పాలసీ, వ్యాపారం, టెక్నాలజీ రంగాల ప్రముఖులతో భారత్ గ్లోబల్ ప్రయాణం, ఎదుగుదలపై ఈ సమ్మిట్ చర్చలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…