రంజాన్ సందర్భంగా జైపూర్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం కనువిందు చేసింది. హిందూ–ముస్లిం ఏకతా సమితి ఆధ్వర్యంలో, ఈద్గాహ్లో నమాజ్ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులపై హిందూ సమాజానికి చెందిన సభ్యులు పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్య దేశవ్యాప్తంగా సోదరభావం, సామాజిక ఐక్యతకు బలమైన సందేశాన్ని అందించింది.
ఈద్ ఉదయం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తుల్లో ఈద్గాహ్కు చేరుకుని ప్రశాంత వాతావరణంలో నమాజ్ నిర్వహించారు. నమాజ్ పూర్తైన వెంటనే అక్కడ ఉన్న హిందూ సమాజ సభ్యులు నమాజ్ చేస్తున్న వారిపై పూల వర్షం కురిపించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. పరస్పర ప్రేమ, గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా హిందూ–ముస్లిం ఏకతా సమితికి చెందిన రాజేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, “అందరికీ ఈద్ శుభాకాంక్షలు. మతాల మధ్య ఐక్యత ఎప్పటికీ కొనసాగాలి. కొందరు విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తప్పు.
రాముడు లేకుండా రమజాన్ లేదు, ఈద్ లేకుండా దీపావళి లేదు. మనమంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం” అని పేర్కొన్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈద్గాహ్కు చేరుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సౌహార్దం, సోదరభావాన్ని కాపాడాలని అందరూ పిలుపునిచ్చారు.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…