ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ అధిష్టానం సూచనల మేరకు చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో నారా లోకేష్ అస్సాంలో ప్రచారం చేయనున్నారు.
బెంగాలే ఎందుకు..?
చంద్రబాబుకు బెంగాల్ బాధ్యతలు ఇవ్వడంపై ఆసక్తి నెలకొంది. అక్కడి సీఎం మమతా బెనర్జీ ఒకప్పుడు చంద్రబాబుకు సన్నిహితురాలు. గతంలో ఆమెకు ఆయన మద్దతు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా బెంగాల్లో తెలుగు వారిలో చంద్రబాబుకు మంచి ఆదరణ ఉంది. ఈ కారణాల వల్లే ఆయనకు అక్కడ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.
ఇక నారా లోకేష్ అస్సాంలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అస్సాంలో యువ జనాభా ఎక్కువగా ఉండటం, గతంలో బీహార్ ఎన్నికల సమయంలో లోకేష్ యువతను ఆకట్టుకోవడంలో సఫలీకృతం కావడం బీజేపీకి ప్లస్గా కనిపిస్తోంది. అందుకే అస్సాంలో ఆయన ప్రచారం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇద్దరూ రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగాల్ బీజేపీకి కీలక రాష్ట్రంగా మారింది. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి బలమైన ప్రచారం అవసరమని పార్టీ భావిస్తోంది. మరోవైపు అస్సాంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా యువ నాయకత్వం ద్వారా ప్రచారం చేయిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి ఇతర రాష్ట్రాల నుంచి మిత్రపక్షాల నాయకులను రంగంలోకి దింపడం ద్వారా ఎన్నికల ప్రచారానికి కొత్త ఉత్సాహం తీసుకురావాలని ఎన్డీయే భావిస్తోంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…