వరుస పేలుళ్లు వణుకు పుట్టిస్తున్నాయి. శనివారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే, ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో మరో భారీ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 21 మంది మరణించగా, నాగ్పూర్ జిల్లా కటోల్ తాలూకాలోని ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ అనే పేలుడు పదార్థాల కర్మాగారంలో జరిగిన ప్రమాదం 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు పారిశ్రామిక భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
నాగ్పూర్ జిల్లా రావుల్గావ్లో ఉన్న ఈ కర్మాగారంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మైనింగ్, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పేలుడు పదార్థాలను తయారు చేసే ఈ యూనిట్లో డెటొనేటర్ ప్యాకింగ్ విభాగంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ధాటికి ఫ్యాక్టరీ భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు 17 మంది మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
నిన్న ఏపీలో జరిగిన ఘటన కూడా ఇంతే భీభత్సాన్ని సృష్టించింది. సామర్లకోట సమీపంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమలో జరిగిన పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దాని తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం అత్యంత విషాదకరం. పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని, సమీపంలోని పాఠశాల భవనాలకు పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్న మాటలు వింటుంటే ఒళ్లు గగురు పుట్టిస్తోంది.
బాణసంచా తయారీ కేంద్రాలు లేదా పేలుడు పదార్థాల ఫ్యాక్టరీల్లో చిన్నపాటి అజాగ్రత్త కూడా భారీ ప్రాణనష్టానికి దారితీస్తోంది. నాగ్పూర్ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రెండ్రోజుల్లో సుమారు 40 మంది పేద కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పరిశ్రమల యాజమాన్యాలు లాభాల కోసం భద్రతా నియమాలను గాలికి వదిలేయడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on March 1, 2026 12:28 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…