మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం జరిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
గాజువాక సమీపంలోని గంగవరం పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారిని యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిస్కెట్లు, తినుబండారాలు కొనిపెడతానని నమ్మబలికి చిన్నారిని తన వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించిన తల్లి అనుమానంతో నిందితుడిని నిలదీయగా ఘటన బయటపడింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రెండు రోజుల కిందట అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్బాడీని గుర్తించారు.
కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను అత్యాచారం చేసి చంపినట్లు గుర్తించారు. ఆ తర్వాత కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అది మరువక ముందే విశాఖలో మరో అత్యాచారయత్నం ఘటన వెలుగు చూసింది.
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…