Trends

ఏపీ వద్దంటున్న కంపెనీ లక్ష కోట్లకు ఎదిగింది


ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ దివీస్ ల్యాబ్స్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జిల్లాలోని కొత్తపాకల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక్కడ దివీస్ ఫ్యాక్టరీ నిలిపి వేయాలని, తాము అధికారంలోకి వస్తేఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపిస్తానని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వామపక్ష నేతలతో కలిసి ఈ ఫ్యాక్టరీ లోనికి దూసుకెళ్లిన స్థానికులు ప్రహరీ గోడను కూలగొట్టడంతో పాటు అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. షెడ్లను ధ్వంసం చేశారు. కొందరు పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని, ఆ రాళ్లతో కంపెనీ గోడల మీద విసురుతున్న దృశ్యాలను పలు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి కూడా.

ఐతే ఏపీలో దివీస్‌కు వ్యతిరేకంగా ఇంత ఆందోళన జరుగుతుంటే.. ఆ సంస్థ అరుదైన ఘనత సాధించింది. దేశంలో లక్ష కోట్ల మార్కెట్ విలువ కలిగిన అరుదైన కంపెనీల్లో ఒకటిగా ఘనత సాధించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతి పెద్ద ఫార్మా కంపెనీల్లో రెండో స్థానం సాధించింది.

సన్ ఫార్మా 1 లక్షా 37 వేల కోట్ల విలువతో అగ్ర స్థానంలో ఉండగా.. దివీస్ 1 లక్షా 1674 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. డాక్టర్ రెడ్డీస్ 84 వేల కోట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. సిప్లా రూ.63 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 2003లో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.10 రూపాయల ముఖ విలువతో ఉన్న షేర్‌ను అప్పుడు రూ.130కి విక్రయించింది. ఇప్పుడా షేర్ ధర రూ.3800 దాటిపోవడం విశేషం. ఏడాది వ్యవధిలో షేర్ ధర రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే దివీస్ మార్కెట్ విలువ లక్ష కోట్ల మార్కును దాటేసింది.

This post was last modified on December 18, 2020 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

27 minutes ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

2 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

2 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

5 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago