Trends

ప‌లాష్‌ను కొట్టిన మ‌హిళా క్రికెట‌ర్లు?

రెండు నెల కింద‌ట‌ భార‌త అగ్ర‌శ్రేణి మ‌హిళా క్రికెట‌ర్‌ స్మృతి మంధాన పెళ్లి అర్ధంత‌రంగా ఆగిపోవ‌డంపై ఎంత చ‌ర్చ జ‌రిగిందో తెలిసిందే. స్మృతి తండ్రి అనారోగ్యం పాల‌వ‌డం వ‌ల్లే ఈ పెళ్లికి బ్రేక్ ప‌డిన‌ట్లు ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ రోజులు గ‌డిచేకొద్దీ ఈ వ్య‌వ‌హారం అనేక సందేహాలకు తావిచ్చింది. పెళ్లి వాయిదా ప‌డడం కాకుండా మొత్తంగా ఆగిపోవ‌డంతో అందుకు దారి తీసిన కార‌ణాలేంట‌నే చ‌ర్చ విస్తృతంగా జ‌రిగింది. 

ప‌లాష్ ముచ్చ‌ల్‌ గ‌తంలో ఒక‌మ్మాయితో అత‌ను ఎంగేజ్మెంట్ వ‌ర‌కు వెళ్ల‌డం.. స్మృతితో రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌గానే ఒక అమ్మాయిని ఫ్ల‌ర్ట్ చేస్తూ మెసేజ్‌లు పెట్ట‌డం.. దీనికి సంబంధించిన ఫొటోలు, స్క్రీన్ షాట్లు వైర‌ల్ కావ‌డం సంచ‌ల‌నం రేప‌గా.. మ‌రోవైపు పెళ్లి ఆగిపోవ‌డానికి ఇవేవీ కార‌ణాలు కావంటూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. స్మృతితో పెళ్లికి ముందు రోజు రాత్రి ప‌లాష్ వేరే అమ్మాయితో దొరికిపోయాడన్న‌ది ఆ స్టోరీ సారాంశం.

ఇప్పుడు ఆ విష‌యాన్నే స్మృతి, ప‌లాష్‌ల కామ‌న్ ఫ్రెండ్ ఒక‌రు ధ్రువీక‌రించారు. అత‌డి పేరు.. విజ్ఞాన్ మానే. అత‌ను ప్ర‌ముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్మృతి, ప‌లాష్ పెళ్లి ఆగిపోవ‌డానికి దారి తీసిన కార‌ణాల గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు.

ముందు రోజు రాత్రి ప‌లాష్‌.. ఒక అమ్మాయితో శృంగారం జ‌రుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడ‌ని అత‌ను వెల్ల‌డించాడు. ఇది చూసి స్మృతి స‌హ‌చ‌ర మ‌హిళా క్రికెట‌ర్లు అత‌డిని బాగా కొట్టిన‌ట్లు అత‌ను తెలిపాడు. పెళ్లి ఆగిపోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని అత‌న‌న్నాడు. 

ప‌లాష్ మోస‌గాడని.. అమ్మాయిల వ్య‌వ‌హారాల‌తో పాటు డ‌బ్బు తీసుకుని మోసం చేసే అల‌వాటు కూడా అత‌డికి ఉంద‌ని అత‌ను ఆరోపించాడు. ప‌లాష్ ఒక సినిమా కోసం త‌న ద‌గ్గ‌ర రూ.40 ల‌క్ష‌లు డ‌బ్బులు తీసుకున్నాడ‌ని.. దాని గురించి త‌ర్వాత అడిగితే సినిమా బ‌డ్జెట్ పెర‌గ‌డం వ‌ల్ల ఇంకో రూ.10 ల‌క్ష‌లు ఇస్తే పూర్త‌వుతుంద‌ని చెప్పారని.. చివ‌రికి కొన్ని రోజుల‌కు త‌న‌ను అత‌డి కుటుంబ‌మంతా బ్లాక్ చేసి అవాయిడ్ చేసింద‌ని అత‌ను పేర్కొన్నాడు.

త‌న వ్య‌క్తిగ‌త గొడ‌వ సంగ‌తేమో కానీ.. స్మృతితో పెళ్లికి ముందు రోజు రాత్రి ప‌లాష్ వేరే అమ్మాయితో దొరికిపోయాడ‌ని, అత‌ణ్ని మ‌హిళా క్రికెట‌ర్లు కొట్టార‌నే స‌మాచారం మాత్రం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

స్మృతి పెళ్లికి వెళ్లి సంద‌డి చేసిన మ‌హిళా క్రికెట‌ర్లు జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధ యాద‌వ్‌, అరుంధతి రెడ్డి. మ‌రి మానే మ‌ట‌ల్ని బ‌ట్టి చూస్తే వీళ్లే ప‌లాష్‌ను కొట్టార‌న్న‌మాట‌. అస‌లు ప‌లాష్ మ‌రో అమ్మాయితో ఉండ‌గా చూసింది శ్రేయాంక అని వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత స్మృతి సోద‌రుడు.. ప‌లాష్ మీద ఎటాక్ చేశాడ‌ని.. ఈ గొడ‌వ, పెళ్లి ఆగిపోయిన నేప‌థ్యంలో స్మృతి తండ్రి అనారోగ్యం పాల‌య్యాడ‌ని అప్పుడు ప్ర‌చారం జ‌రిగింది.

This post was last modified on January 25, 2026 8:11 am

Share

Recent Posts

వైకుంఠపురములో విశ్వనాథ్… పెద్ద పోలికే

నిన్న చెన్నైలో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీన్ని తమిళ సినిమాగానే చెబుతూ వస్తున్నారు కాబట్టి దానికి…

17 minutes ago

సీనియర్ హీరోని ట్రోల్ చేస్తే ఏమొస్తుంది

ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…

5 hours ago

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

8 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

11 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

11 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

11 hours ago