Trends

ప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 12 బిలియనీర్ల దగ్గర ఉన్న సంపద, భూమిపై ఉన్న సగం జనాభా, అంటే సుమారు 400 కోట్ల మంది దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ. ఆక్స్ ఫామ్ (Oxfam) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలను వెల్లడించింది.

ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఈ అత్యంత ధనికుల సంపద 16.2 శాతం పెరిగి 18.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ అనుసరిస్తున్న కార్పొరేట్ పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి విధానాలు ఈ గ్లోబల్ ఎలైట్ గ్రూప్‌కు బాగా కలిసివచ్చాయని ఆక్స్ ఫామ్ విశ్లేషించింది. ఈ సంపద కేవలం విలాసాలకే పరిమితం కాకుండా, రాజకీయాలను శాసించే శక్తిగా మారుతోందని నివేదిక హెచ్చరించింది.

బిలియనీర్లు తమ సంపదతో మీడియా సంస్థలను కొనుగోలు చేస్తూ రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేస్తున్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఎలాన్ మస్క్ ‘X’ ప్లాట్‌ఫామ్‌ను, జెఫ్ బెజోస్ ‘వాషింగ్టన్ పోస్ట్’ను కొనడం దీనికి నిదర్శనమని ఆక్స్ ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ అన్నారు. ఈ ధనిక వర్గానికి సామాన్యులకు మధ్య పెరుగుతున్న ఈ భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ట్రంప్ భారీ బృందంతో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నిరసనలు కూడా మొదలయ్యాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవ్వని వ్యక్తులు ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం ఏంటని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ పన్ను ఒప్పందాలను పక్కన పెట్టి మల్టీ నేషనల్ కంపెనీలకు మినహాయింపులు ఇవ్వడం వల్ల అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆక్స్ ఫామ్ విమర్శించింది.

అత్యంత ధనికులు తమ సంపదతో దేశాల ఆర్థిక నియమాలను, పరిపాలనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి ధోరణి వల్ల సామాన్యుల హక్కులు, రాజకీయ స్వేచ్ఛ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఈ నివేదిక ఒక క్లారిటీ ఇచ్చింది.

This post was last modified on January 20, 2026 9:10 am

Share

Recent Posts

కొబ్బరికాయ కొట్టెందుకు ముఖ్యమంత్రి అవసరమా

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…

22 minutes ago

ప్రొడ్యూసర్ నానితో… హీరో నితిన్

నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…

2 hours ago

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

4 hours ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

5 hours ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

5 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

6 hours ago