Trends

కోడిపందెంలో ఏకంగా కోటిన్నర గెలిచాడు

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు..గొబ్బిళ్లు…కళ్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు వేసిన లోగిళ్లు…వాటితో పాటు కోడి పందేలు కామన్. ఓ వైపు కోడి పందేలు వద్దని కోర్టులు చెబుతున్నప్పటికీ…ప్రభుత్వాలు, పోలీసులు కూడా పందేలను ఆపలేని పరిస్థితి.

కోడి పందేలు కూడా సంక్రాంతి పండుగ సంస్కృతిలో ఓ భాగమని పందెం రాయుళ్లు చెబుతూ కోట్ల కొద్దీ పందేలు కడుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ నాడు ఓ పందెం రాయుడు జాక్ పాట్ కొట్టాడు. కోడి పందెంలో గెలిచి కోటిన్నర పట్టుకుపోయాడు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో రెండో రోజు కూడా కోడి పందేలు కొనసాగాయి. ఈ క్రమంలోనే పై బోయిన వెంకటరామయ్య బరిలో రూ.1.53 కోట్లకు కోడి పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్‌, రాజమండ్రి రమేష్ ల మధ్య ఈ పందెం నిర్వహించారు.

ఈ పందెంలో ప్రభాకర్ కు చెందిన ‘సేతువ’ కోడిపై రమేష్ కు చెందిన ‘డేగ’ కోడి విజయం సాధించింది. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ పందెం అట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

దీంతో, నెటిజన్లు ఈ పందేలపై భిన్నంగా స్పందిస్తున్నారు. కోడి పందేలు చట్టరీత్యా నేరం అని, అయినప్పటికీ అన్ని ప్రభుత్వాలు వాటిని ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు అంటున్నారు. బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వాలు కోడిపందేలపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. కోడి పందేలలో కూడా లక్షలు పోగొట్టుకొని కుటుంబాలు చిన్నాభిన్నమైన ఘటనలున్నాయని గుర్తు చేస్తున్నారు.

This post was last modified on January 15, 2026 6:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

22 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

2 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago