వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక దుర్మార్గుడు కూడా ఇలాంటి పనులే చేస్తుంటాడు. వాడి మీద తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు. వీడి దారుణ చేష్టల గురించి తెలిస్తే.. ఇలాంటోడి మీద పోక్సో కేసు కూడా తక్కువే అన్న భావన కలుగక మానదు. ఇంతకూ వీడి దారుణాల్లోకి వెళితే..
విశాఖపట్నానికి చెందిన 39 ఏళ్ల సత్యమూర్తికి ఒక పాడు బుద్ధి ఉంది. వైరల్ హబ్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఇతగాడు.. 2018 నుంచి యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యన ఇద్దరు చిన్నారుల్ని ఇంటర్వ్యూ పేరుతో గలీజు ప్రశ్నలు వేయటమే కాదు.. వాటి నుంచి సమాధానాలు రాబట్టి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అంతేనా.. అక్కడితో అగని ఈ దుర్మార్గుడు.. చిన్నారులు ముద్దులు పెట్టుకునేలా చేశాడు.
ఆ పాడు వీడియోలను యూట్యూబ్.. ఇన్ స్టాలో పోస్టు చేశాడు. చూసినంతనే చిరాగ్గా.. పిల్లలతో ఈ పాడు పనులేంట్రా అన్న కోపాన్ని కలిగించే ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. పలువురు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో స్పందించిన హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టి.. అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియోలపై చర్యలు చేపట్టారు.
పోక్సో.. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయటమే కాదు.. తాజాగా అతగాడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ దుర్మార్గ చానల్ అందుబాటులోనే ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి కంటెంట్ చేసే వారిపై చర్యలు కఠినంగా ఉండటమేకాదు.. ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తే.. కఠిన శిక్షలు తప్పవన్న సందేశం త్వరగా అందరికి చేరాల్సిన అవసరం ఉంది. అందుకోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 8, 2026 2:16 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…