వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక దుర్మార్గుడు కూడా ఇలాంటి పనులే చేస్తుంటాడు. వాడి మీద తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు. వీడి దారుణ చేష్టల గురించి తెలిస్తే.. ఇలాంటోడి మీద పోక్సో కేసు కూడా తక్కువే అన్న భావన కలుగక మానదు. ఇంతకూ వీడి దారుణాల్లోకి వెళితే..
విశాఖపట్నానికి చెందిన 39 ఏళ్ల సత్యమూర్తికి ఒక పాడు బుద్ధి ఉంది. వైరల్ హబ్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఇతగాడు.. 2018 నుంచి యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యన ఇద్దరు చిన్నారుల్ని ఇంటర్వ్యూ పేరుతో గలీజు ప్రశ్నలు వేయటమే కాదు.. వాటి నుంచి సమాధానాలు రాబట్టి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అంతేనా.. అక్కడితో అగని ఈ దుర్మార్గుడు.. చిన్నారులు ముద్దులు పెట్టుకునేలా చేశాడు.
ఆ పాడు వీడియోలను యూట్యూబ్.. ఇన్ స్టాలో పోస్టు చేశాడు. చూసినంతనే చిరాగ్గా.. పిల్లలతో ఈ పాడు పనులేంట్రా అన్న కోపాన్ని కలిగించే ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. పలువురు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో స్పందించిన హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టి.. అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియోలపై చర్యలు చేపట్టారు.
పోక్సో.. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయటమే కాదు.. తాజాగా అతగాడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ దుర్మార్గ చానల్ అందుబాటులోనే ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి కంటెంట్ చేసే వారిపై చర్యలు కఠినంగా ఉండటమేకాదు.. ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తే.. కఠిన శిక్షలు తప్పవన్న సందేశం త్వరగా అందరికి చేరాల్సిన అవసరం ఉంది. అందుకోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 8, 2026 2:16 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…