కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆర్చన అదే గ్రామానికి చెందిన అనిల్ అనే పెళ్లయిన వ్యక్తితో ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పలుమార్లు ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె ఆ సంబంధాన్ని విడిచిపెట్టకపోవడంతో, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే భావనతో తల్లిదండ్రులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నవంబర్ 15 రాత్రి ఆర్చన నిద్రపోయిన తర్వాత ఆమెకు బలవంతంగా విషం తాగించారని, ఇంకా ప్రాణాలతో ఉన్న సమయంలో తండ్రి గొంతు నులిమి చంపినట్లు విచారణలో బయటపడింది. పోలీసుల విచారణలో తండ్రి రెడ్డి రాజు నేరాన్ని ఒప్పుకున్నాడు.
ఈ ఘటన నేపథ్యంలో సైదాపూర్ పోలీసులు తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్యలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారిని కస్టడీకి పంపింది.
ఇదిలా ఉండగా, ఆర్చన అక్క శ్రావణి మరో ఫిర్యాదు చేస్తూ, అనిల్తో ఉన్న సంబంధమే తన చెల్లి మృతికి కారణమని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా అనిల్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో కుటుంబ గౌరవం పేరుతో జరిగే హింస ఎంత దారుణమైనదో మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 27, 2025 6:18 pm
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…