Trends

పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆర్చన అదే గ్రామానికి చెందిన అనిల్ అనే పెళ్లయిన వ్యక్తితో ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పలుమార్లు ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె ఆ సంబంధాన్ని విడిచిపెట్టకపోవడంతో, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే భావనతో తల్లిదండ్రులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నవంబర్ 15 రాత్రి ఆర్చన నిద్రపోయిన తర్వాత ఆమెకు బలవంతంగా విషం తాగించారని, ఇంకా ప్రాణాలతో ఉన్న సమయంలో తండ్రి గొంతు నులిమి చంపినట్లు విచారణలో బయటపడింది. పోలీసుల విచారణలో తండ్రి రెడ్డి రాజు నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఈ ఘటన నేపథ్యంలో సైదాపూర్ పోలీసులు తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్యలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారిని కస్టడీకి పంపింది.

ఇదిలా ఉండగా, ఆర్చన అక్క శ్రావణి మరో ఫిర్యాదు చేస్తూ, అనిల్‌తో ఉన్న సంబంధమే తన చెల్లి మృతికి కారణమని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా అనిల్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో కుటుంబ గౌరవం పేరుతో జరిగే హింస ఎంత దారుణమైనదో మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on December 27, 2025 6:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

25 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago