జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన “మెగాక్వేక్ అడ్వైజరీ” జారీ చేయడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సోమవారం రాత్రి అవోమోరి తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జరిగిన భూకంపం వల్ల పెద్దగా నష్టం జరగకపోయినా, ఇది రాబోయే పెను విపత్తుకు సంకేతం కావచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి 2011 నాటి సునామీ విపత్తును గుర్తు చేస్తోందని అధికారులు అంటున్నారు.
ఈ అడ్వైజరీ అంటే కచ్చితంగా భూకంపం వస్తుందని జోస్యం చెప్పడం కాదు, కానీ ప్రమాదం జరిగే అవకాశం మాత్రం పెరిగిందని అర్థం. వచ్చే వారంలోగా 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భారీ భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని జపాన్ మెటియోరోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు ఎమర్జెన్సీ కిట్లు సిద్ధం చేసుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖాళీ చేయడానికి రెడీగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ఉండటమే మంచిదని అధికారులు చెబుతున్నారు.
ఈ భయానికి ఒక బలమైన కారణం ఉంది. 2011లో జపాన్ను అతలాకుతలం చేసిన 9.0 తీవ్రత గల మెగాక్వేక్ రావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు, అదే ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే ప్యాటర్న్ కనిపిస్తుండటంతో శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. జపాన్ ట్రెంచ్ ప్రాంతంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలికలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం.
ఒకవేళ ఇప్పుడు కనుక ఆ మెగాక్వేక్ వస్తే, ఊహించని నష్టం జరుగుతుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. దాదాపు 30 మీటర్లు (98 అడుగులు) ఎత్తులో సునామీ విరుచుకుపడే అవకాశం ఉంది. దీనివల్ల ఏకంగా 1,99,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని, 2,20,000 భవనాలు ధ్వంసం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా కూడా దాదాపు 198 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం జారీ చేసిన ఈ అలర్ట్ హక్కైడో నుంచి చిబా వరకు ఉన్న 182 మున్సిపాలిటీలకు వర్తిస్తుంది. గత ఏడాది ఇలాంటి హెచ్చరిక జారీ చేసినప్పుడు ప్రజలు భయంతో సరుకులు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు, అందుకే ఈసారి అధికారులు జాగ్రత్తగా, స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ శీతాకాలంలో ఈ విపత్తు సంభవిస్తే, సునామీతో పాటు చలి తీవ్రత వల్ల కూడా వేలమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…