Trends

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. కానీ జర్మనీలో తొమ్మిదేళ్లుగా ఉంటున్న మయూఖ్ పాంజా అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. తనకు జర్మన్ పాస్‌పోర్ట్ వచ్చే అర్హత ఉన్నా సరే, దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి మనసు ఒప్పుకోలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మయూఖ్ జర్మనీలో ఏఐ కంపెనీ ఫౌండర్. అక్కడికి వెళ్లి తొమ్మిదేళ్లు దాటింది. ఏడాది క్రితమే ఆయనకు జర్మన్ పౌరసత్వం తీసుకునే అర్హత వచ్చింది. కానీ ఆయన అప్లై చేయలేదు. దీనికి కారణం చెబుతూ సోషల్ మీడియాలో (X) ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. “ఇది కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే కావచ్చు. కానీ నేను భారతీయుడిని. జర్మన్‌గా మారడం నాకు ఎందుకో వింతగా అనిపిస్తోంది. నేను ఇక్కడ ఎంతకాలం ఉన్నా నా మనసు మాత్రం ఇండియన్‌గానే ఫీల్ అవుతోంది” అని రాసుకొచ్చాడు.

జర్మనీ చరిత్ర, భాష, సంస్కృతి తనకు తెలుసు కానీ వాటితో ఎమోషనల్ కనెక్షన్ లేదని చెప్పాడు. ఉదాహరణకు జర్మనీ ఫుట్‌బాల్ మ్యాచ్ గెలిస్తే తనకు పెద్దగా ఏమీ అనిపించదని, అదే ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఆ కిక్కే వేరని చెప్పుకొచ్చాడు. తాను జర్మనీకి స్నేహితుడిని మాత్రమే తప్ప, జర్మనీ వాడిని కాలేనని స్పష్టం చేశాడు.

మరో ముఖ్యమైన కారణం కూడా చెప్పాడు. జర్మనీ పౌరసత్వం తీసుకుంటే అక్కడి పద్ధతులకు తగ్గట్టుగా తాను మారాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న వారి సంస్కృతి తన కోసం మారాలని కోరుకోవడం తప్పు. అదే ఇండియాలో అయితే, మెజారిటీ అభిప్రాయంతో విభేదించినా సరే, తన గొంతు వినిపించే హక్కు తనకు ఉంటుందని ఫీల్ అయ్యాడు. “నా అభిప్రాయాలు భారతీయమైనవి. అవి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ అవి కలిగి ఉండే హక్కు ఇండియన్ పాస్‌పోర్ట్ నాకు ఇస్తుంది” అని గర్వంగా చెప్పాడు.

This post was last modified on December 9, 2025 9:38 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

14 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

40 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

3 hours ago