Trends

AI వాడి కరెంట్ బిల్లు తగ్గిస్తారా?

పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్ బిల్లుల భారం తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం తీసుకోబోతోంది. టెక్నాలజీని వాడి విద్యుత్ రంగంలో జరుగుతున్న నష్టాలను అరికట్టి, ఆ లాభాన్ని జనాలకు బదిలీ చేయాలని సెంటర్ ప్లాన్ చేస్తోంది.

కరెంట్ బిల్లులు ఎక్కువగా ఉండటానికి అసలు కారణం కరెంట్ దొంగతనాలు, సప్లైలో వచ్చే నష్టాలు. చాలా చోట్ల వైర్లు వేసి దొంగతనంగా కరెంట్ వాడేస్తుంటారు. దీనివల్ల కంపెనీలకు వచ్చే నష్టాన్ని, మన బిల్లుల్లో వేసి వసూలు చేస్తారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ దొంగతనాలను ఇట్టే పసిగట్టవచ్చు. ఎక్కడైనా తేడాగా కరెంట్ వాడుతున్నా, రీడింగ్‌లో మార్పులు ఉన్నా సాఫ్ట్‌వేర్ వెంటనే అధికారులకు అలర్ట్ పంపిస్తుంది.

దొంగతనాలు ఆగితే కంపెనీల నష్టాలు తగ్గుతాయి, ఆటోమేటిక్‌గా మన బిల్లులు తగ్గుతాయి. కేవలం దొంగతనాలు ఆపడమే కాదు, కరెంట్ సప్లై సిస్టమ్‌ను ఆటోమేట్ చేయడానికి పెద్ద పెద్ద టెక్నాలజీలను (GPT మోడల్స్) వాడనున్నారు. ఎక్కడ డిమాండ్ ఎంత ఉంది, ఎప్పుడు సప్లై పెంచాలి అనే నిర్ణయాలు ఫాస్ట్‌గా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇక అక్టోబర్‌లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లు 2025 కూడా గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటివరకు కరెంట్ సప్లై అంటే ప్రభుత్వానిదే ఆధిపత్యం. కానీ ఈ కొత్త బిల్లుతో ప్రైవేట్ కంపెనీలు కూడా రంగంలోకి వస్తాయి. టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్ పోటీ పడితే మనకు ఆఫర్లు ఎలా వచ్చాయో, ఇక్కడ కూడా పోటీ పెరిగి రేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే రైతులకు, పేదలకు ఇచ్చే సబ్సిడీలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

Kumar

Recent Posts

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 minute ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

5 minutes ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago