సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలతో ఏకంగా 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ అనూహ్యమైన ఫామ్ చూస్తుంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ అందుకుంటాడా అనే చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీకి వంద సెంచరీలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని గవాస్కర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డు సమం చేయాలంటే మరో 16 కావాలి. గవాస్కర్ లెక్క ప్రకారం.. కోహ్లీ మరో మూడేళ్లు క్రికెట్ ఆడితే చాలు, ఈజీగా ఈ మైలురాయిని చేరుకుంటాడు. మొన్నటి సిరీస్లో రెండు కొట్టాడు, రేపు న్యూజిలాండ్తో మరో రెండు కొడితే 87 అవుతాయి. అలా చూసుకుంటే వంద కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని గవాస్కర్ జోస్యం చెప్పారు.
వైజాగ్లో కోహ్లీ ఆడిన తీరు చూసి గవాస్కర్ ఫిదా అయ్యారు. వన్డేల్లో కోహ్లీని ఇలాంటి ‘టీ20 అవతారం’లో చూడటం చాలా అరుదని అన్నారు. గెలుపు ఖాయమైన మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా కోహ్లీ చెలరేగిపోయాడు. మొదటి బంతి నుంచే షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ అందులో ఒక్కటి కూడా రిస్క్ షాట్ లేదు.
“అసలు అతని ఇన్నింగ్స్లో ఒక్కటంటే ఒక్క ఇన్ సైడ్ ఎడ్జ్ గానీ, అవుట్-సైడ్ ఎడ్జ్ గానీ కనిపించిందా? ఎవరైనా చెప్పగలరా?” అని గవాస్కర్ ప్రశ్నించారు. అంటే అంత పర్ఫెక్ట్గా, క్లాసీగా కోహ్లీ బ్యాటింగ్ చేశాడని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం కోహ్లీ ఉన్న టచ్ చూస్తుంటే ఆల్ టైమ్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో కోహ్లీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
This post was last modified on December 7, 2025 1:06 pm
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…