సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలతో ఏకంగా 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ అనూహ్యమైన ఫామ్ చూస్తుంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ అందుకుంటాడా అనే చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీకి వంద సెంచరీలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని గవాస్కర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డు సమం చేయాలంటే మరో 16 కావాలి. గవాస్కర్ లెక్క ప్రకారం.. కోహ్లీ మరో మూడేళ్లు క్రికెట్ ఆడితే చాలు, ఈజీగా ఈ మైలురాయిని చేరుకుంటాడు. మొన్నటి సిరీస్లో రెండు కొట్టాడు, రేపు న్యూజిలాండ్తో మరో రెండు కొడితే 87 అవుతాయి. అలా చూసుకుంటే వంద కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని గవాస్కర్ జోస్యం చెప్పారు.
వైజాగ్లో కోహ్లీ ఆడిన తీరు చూసి గవాస్కర్ ఫిదా అయ్యారు. వన్డేల్లో కోహ్లీని ఇలాంటి ‘టీ20 అవతారం’లో చూడటం చాలా అరుదని అన్నారు. గెలుపు ఖాయమైన మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా కోహ్లీ చెలరేగిపోయాడు. మొదటి బంతి నుంచే షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ అందులో ఒక్కటి కూడా రిస్క్ షాట్ లేదు.
“అసలు అతని ఇన్నింగ్స్లో ఒక్కటంటే ఒక్క ఇన్ సైడ్ ఎడ్జ్ గానీ, అవుట్-సైడ్ ఎడ్జ్ గానీ కనిపించిందా? ఎవరైనా చెప్పగలరా?” అని గవాస్కర్ ప్రశ్నించారు. అంటే అంత పర్ఫెక్ట్గా, క్లాసీగా కోహ్లీ బ్యాటింగ్ చేశాడని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం కోహ్లీ ఉన్న టచ్ చూస్తుంటే ఆల్ టైమ్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో కోహ్లీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
This post was last modified on December 7, 2025 1:06 pm
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…